తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా నిర్మించతలపెట్టిన కొత్త అసెంబ్లీ భవన నిర్మాణంకు ఆది నుండి హంసపాదు అన్నట్లుగా ఉంది.మొదట పెరేడ్ గ్రౌండ్స్లో అసెంబ్లీ నిర్మాణం చేయాలనుకున్నప్పటికి అందుకు కేంద్రం ఒప్పుకోలేదు.
దాంతో ఎర్రమంజిల్లో ఉన్న ప్రభుత్వ భూమిలో అసెంబ్లీని నిర్మించాలని నిర్ణయించారు.గత జూన్లో కేసీఆర్ కొత్త అసెంబ్లీకి శంకుస్థాపన చేయడం జరిగింది.
వచ్చే ఏడాది వరకు భవన నిర్మాణంను పూర్తి చేయాలని నిర్ణయించుకున్నారు.
కొత్త అసెంబ్లీ నిర్మాణం కోసం పెద్ద ఎత్తున భవనాలను కూల్చి వేస్తున్నారు.
పాత భవనాల కూల్చివేత విషయమై న్యాయస్థానంలో పిటీషన్ దాఖలు చేయడం జరిగింది.నేడు ఆ పిటీషన్పై కోర్టులో వాదోపవాదనలు జరిగాయి.
సుదీర్ఘంగా వాదనలు విన్న కోర్టు పిటీషనల్ వాదనలతో ఏకీభవించింది.ప్రజా ధనం వృదా అవుతుందనే ఉద్దేశ్యంతో కొత్త భవన నిర్మాణం అక్కర్లేదని, ప్రస్తుతం ఉన్న భవనం బాగానే ఉందని కోర్టు అభిప్రాయం వ్యక్తం చేసింది.
అందుకే కొత్త అసెంబ్లీ నిర్మాణం అక్కర్లేదు అంటూ హైకోర్టు ప్రభుత్వంకు మైండ్ బ్లాంక్ అయ్యే తీర్పు ఇచ్చింది.