విశాఖ ఎయిర్ పోర్ట్ లో వైసీపీ అధినేత జగన్ మీద కోడి కత్తితో జరిగిన దాడి వ్యవహారం రోజుకోరకంగా ఏపీ ప్రభుత్వానికి తలనొప్పి తీసుకొస్తూనే ఉంది.ప్రస్తుతం ఈ వ్యవహారం హై కోర్ట్ లో పరిధిలో ఉంది.
అయితే ఈ కేసు విచారణ ను నిలుపుదల చేయించాలన్న ఎపి ప్రభుత్వానికి మరోసారి చుక్కెదురైంది.ఈ కేసువిచారణపై స్టే ఇవ్వాలని ప్రభుత్వం కోరగా, హైకోర్టు నిరాకరించింది.
కేంద్రం దీనిపై కౌంటర్ వేయాలని ఈనెల 30 వరకు గడువు ఇచ్చారు.కాగా ఎన్.ఐ.ఎ.దర్యాప్తు నివేదికను కోర్టుకు ఇవ్వాలని ఎన్.ఐ.ఎ.ని ఆదేశించింది.కాగా ఇప్పటికే టిడిపి నేత,హోటల్ యజమాని హర్షవర్దన్ చౌదరితో పలువురిని ఇంతవరకు ఎన్.ఐ.ఎ.విచారణ చేసిన సంగతి తెలిసిందే.