ఏపీ - తమిళనాడు సరిహద్దులో హై అలర్ట్

ఆంధ్ర- తమిళనాడు సరిహద్దులో పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు.నిన్న వడమాలపేట టోల్ ప్లాజా వద్ద జరిగిన ఘటన నేపథ్యంలో వాహనాలను విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు.

 High Alert On Ap-tamil Nadu Border-TeluguStop.com

టోల్ ప్లాజా వద్ద తమిళనాడు యువ న్యాయవాదులపై స్థానికులు దాడి చేసిన విషయం తెలిసిందే.అయితే, దాడి ఘటనపై తమిళనాడు లాయర్స్ అసోసియేషన్ మండిపడుతోంది.

ఈ క్రమంలో తమిళనాడు లాయర్స్ అసోసియేషన్ బృందం టోల్ ప్లాజా దగ్గరకు వచ్చి గొడవకు దిగుతారని, తమిళనాడులో ఏపీ రిజిస్ట్రేషన్ వాహనాలను అడ్డుకుంటారని ప్రచారంలో ఊపందుకుంది.ఇందుకు సంబంధించిన మెసేజ్ లు పలు వాట్సాప్ గ్రూపుల్లో సర్య్కూలేట్ అవుతున్నట్లుగా పోలీసులు గుర్తించారు.

ఈ నేపథ్యంలో అప్రమత్తమైన ఏపీ పోలీసులు సరిహద్దుల్లో తమిళనాడు పోలీసులను కూడా అప్రమత్తం చేశారు.ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ట బందోబస్తు నిర్వహిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube