కళ్ల కింద నల్లటి వలయాలు ఏర్పడితే ఎంత ఇబ్బందిగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.ఎక్కువ సమయం పాటు కంప్యూటర్లు, ఫోన్లతో గడపడం, మారిన జీవన శైలి, ఆహారపు అలవాట్లు, అధిక ఒత్తివి, నిద్రను నిర్లక్ష్యం చేయడం, పోషకాల లోపం ఇలా రకరకాల కారణాల వల్ల కళ్ల కింద నల్లటి వలయాలు ఏర్పడతాయి.
ముఖ్యంగా అమ్మాయిల్లో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంటుంది.అయితే వీటిని తగ్గించుకునేందుకు ఏవేవో క్రీములు, లోషన్లు, ఆయిల్స్ వాడుతుంటారు.
కానీ, న్యాచురల్గా కూడా నల్లటి వలయాలను తగ్గించుకోవచ్చు.ముఖ్యంగా నల్లటి వలయాలను నివారించడంలో మందారాలు గ్రేట్గా సహాయపడతాయి.మరి మందారాలను ఎలా వాడాలో ఇప్పుడు తెలుసుకుందాం.ముందుగా మందారం పువ్వుల రేకల్ని ఎండ బెట్టి పొడి చేసుకోవాలి.
ఇప్పుడు ఈ పొడిలో కొద్దిగా తేనె కలిపి.కళ్ల చుట్టు అప్లై చేయాలి.పావు గంట పాటు ఆరనిచ్చి.అనంతరం చల్లటి నీటితో కళ్లను శుభ్రం చేసుకోవాలి.ఇలా రెండు రోజులకు ఒక సారి చేస్తే.క్రమంగా నల్లటి వలయాలు దూరం అవుతాయి.
అలాగే మందారం పువ్వు రేకల్ని ఎండ బెట్టి చేసుకున్న పొడిలో కలబంద గుజ్జు వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.ఈ మిశ్రమాన్ని కళ్ల చుట్టు పూతలా వేసి.
ఇరవై నిమిషాల పాటు వదిలేయాలి.ఆ తర్వాత చల్లటి నీటితో క్లీన్ చేసుకోవాలి.
ఇలా వారంలో రెండు లేదా మూడు సార్లు చేస్తే.నల్లటి వలయాలు మటుమాయం అవుతాయి.
ఇక మందారం పువ్వు రేకల్ని ఎండ బెట్టి చేసుకున్న పొడిలో, పాలు, ఓట్స్ పౌడర్ వేసి కలిపి.కళ్ల చుట్టు అప్లై చేసుకోవాలి.పావు గంట పాటు ఆర నిచ్చి.అనంతరం కూల్ వాటర్తో కళ్లను శుభ్రం చేసుకోవాలి.
ఇలా తరచూ చేసినా మంచి ఫలితం పొందుతారు.