ప్రేమలో ఉంటే ఎంత పనైనా చేసేందుకు ధైర్యం వస్తుందంటారు.ప్రేమలో ఉన్న వారు గతంలో ఎన్నో పనులు చేయడం మనం చూశాం.
ప్రేమలో పడితే ఎంతటి వారినైనా ఎదురించే ధైర్యం, ఎంతటి వారినైనా కొట్టే ధైర్యం వస్తుంది.ఇవన్నీ సినిమాల్లోనే చూపిస్తారు అంటారు కాని నిజ జీవితంలో కూడా ఎన్నో సార్లు ఇలాంటి సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి.
తాజాగా ప్రేమలో పడ్డ ఒక అమ్మాయి సొంత ఇంట్లోనే దొంగతనం చేసి సంచలనం సృష్టించింది.
పూర్తి వివరాల్లోకి వెళ్తే… గుజరాత్లోని భక్తినగర్కు చెందిన ప్రియాంక పర్సానా చాలా ఉన్నత కుటుంబంలో జన్మించింది.
ఆమె తండ్రి పెద్ద వ్యాపారవేత్త.కోటీశ్వరుడైన తండ్రి ఆమెకు పూర్తి స్వేచ్చను ఇచ్చాడు.
సంతోషంగా జీవితం గడిపేస్తున్న ప్రియాంక జీవితంలోకి హేత్ షా అనే కుర్రాడు వచ్చాడు.వీరిద్దరు కాలేజ్లో పరిచయం అయ్యారు.
పరిచయం కాస్త ప్రేమగా మారింది.ప్రేమ విషయం ఇంట్లో తెలియకుండా జాగ్రత్త పడుతూ వచ్చారు.
హేత్ షా చదువు పూర్తి చేసి మంచి ఉద్యోగంలో జాయిన్ అయిన తర్వాత ప్రేమ విషయాన్ని చెప్పాలని భావించారు.పైలెట్ ట్రైనింగ్ చేయాలనుకున్న హేత్ షాకు ఆర్థిక ఇబ్బందులు తలెత్తాయి.
ఆయన కుటుంబ సభ్యులు ఆర్థికంగా లేని వారు అవ్వడంతో పైలెట్ ట్రైనింగ్కు డబ్బులు ఇవ్వలేమని చెప్పారు.
తన ప్రియుడు ఎట్టి పరిస్థితుల్లో పైలెట్ అవ్వాలని భావించింది.
దాంతో పాటు అతడి కుటుంబం కూడా తన వారి ముందు ఉన్నతంగా కనిపించాలని భావించింది.అందుకోసం తన ఇంట్లోనే దొంగతనంకు ప్లాన్ చేసింది.
ఇంట్లో ఎవరు లేని సమయంలో 90 లక్షలు విలువ చేసే బంగారం, రెండు కిలోల వెండి, దాదాపు లక్ష రూపాల డబ్బును దోచి, వాటిని దొంగలు ఎత్తుకు పోయినట్లుగా ఉండేలా ఇల్లు అంతా చిందర వందర చేసింది.ప్రియాంక తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో రంగంలోకి దిగిన పోలీసులు మెల్ల మెల్లగా ఎంక్వౌరీ మొదలు పెట్టి చివరకు ప్రియాంకే దొంగ అని నిర్థారించారు.
ప్రియాంక దొంగతనం చేసిందని తెలిసి తల్లిదండ్రులు నివ్వెర పోయారు.హేత్ షా పై పెట్టిన కేసును ఉపసంహరించుకున్నారు.హేత్ షా చదువుకు కావాల్సిన ఆర్థిక సాయం చేసేందుకు కూడా ప్రియాంక తండ్రి ఓకే చెప్పాడట.అయితే పెళ్లికి మాత్రం ఒప్పుకునేందుకు ఆయన సిద్దంగా లేడు.మరి భవిష్యత్తులో ప్రియాంక, హేత్ షాల ప్రేమ వ్యవహారం ఏ స్థాయికి చేరుతుందో చూడాలి.