ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ, జాతిరత్నాలు సినిమాలతో నటుడిగా మంచి పేరును సంపాదించుకోవడంతో పాటు మార్కెట్ ను పెంచుకున్నారు నవీన్ పోలిశెట్టి.లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్, ఢీ ఫర్ దోపిడి, 1 నేనొక్కడినే సినిమాల్లో చిన్నచిన్న పాత్రల్లో నటించిన నవీన్ పోలిశెట్టి హీరోగా నటించిన రెండు సినిమాలతోనే మిడిల్ రేంజ్ హీరోగా ఎదిగారు.
కెరీర్ తొలినాళ్లలో కొన్ని షార్ట్ ఫిలిమ్స్ లో కూడా నటించిన నవీన్ బాలీవుడ్ లో చిచ్చోర్ అనే సినిమాలో నటించారు.
జాతిరత్నాలు మూవీ ప్రమోషన్స్ లో భాగంగా అలీతో సరదాగా షోకు హాజరైన నవీన్ పోలిశెట్టి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.
మీ వ్యాపారం ఎలా ఉంది అని అలీ అడగగా నాదా.? అంటూ నవీన్ పోలిశెట్టి విచిత్రమైన ఎక్స్ ప్రెషన్ ఇస్తారు.ఆ తరువాత అలీ కినువా వ్యాపారం గురించి చెప్పమని అడగగా మీకు ఎలా తెలుసు అని నవీన్ అలీని అడుగుతారు.నేను మొన్న కినువా తెప్పించగా ఎవరిది అని అడిగితే నవీన్ పోలిశెట్టి కినువా అని చెప్పారని నవీన్ వెల్లడించారు.
ఆ తరువాత నవీన్ పోలిశెట్టి జాతిరత్నం కాదని జాతిముదురు అని అలీ అంటారు.ఆ తరువాత కినువా బిజినెస్ గురించి గుక్క తిప్పుకోకుండా చెప్పి నవీన్ అందరినీ ఆశ్చర్యపోయేలా చేశారు.ఆ తరువాత విజయ్ దేవరకొండతో ఉన్న రిలేషన్ గురించి నవీన్ పోలిశెట్టి చెప్పుకొచ్చారు.ప్రభాస్ జాతిరత్నాలు సినిమా ట్రైలర్ ను లాంఛ్ చేశారని ఇప్పుడు ప్రభాస్, తాను బెస్ట్ ఫ్రెండ్స్ అయిపోయామని నవీన్ అన్నారు.
ప్రభాస్ తో తనది చాలా డీప్ లెవెల్ ఫ్రెండ్ షిప్ అని నవీన్ అన్నారు.ఆ తరువాత ప్రభాస్ ను ఫస్ట్ టైమ్ ఎప్పుడు కలిశావ్ అనే ప్రశ్నకు మొన్నే అని నవ్వుతూ చెప్పారు.
లవ్ స్టోరీ గురించి చెప్పమని అలీ అడగా ప్రస్తుతం ఆడియన్స్ కు, తనకు మధ్య లవ్ ఉందని నవీన్ తెలిపారు.జాతిరత్నాలు సినిమా కథ విన్న తరువాత పెళ్లి కాదని ఫిక్సైపోయానంటూ నవీన్ పోలిశెట్టి ఆసక్తికర విషయాలను వెల్లడించారు.