అలనాటి అందాల భామ సౌందర్య ఎన్ని అద్భుతమైన సినిమాలు తిసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్న ఈ భామ పదహారేళ్ళ క్రితం హఠాత్తుగా హెలీకాఫ్టర్ యాక్సిడెంట్ లో మరణించింది.
పెళ్ళైన సంవత్సరానికే ఆమె మరణించింది. ఆమె చనిపోయి పదహారేళ్లు అయినప్పటికీ ఇంకా ఆమెను మర్చిపోలేకపోతున్నారు ఆమె అభిమానులు.
తెలుగు, తమిళ్, హిందీ, మలయాళ భాషల్లో నటించిన ఈమెకు కోట్లమంది అభిమానులు ఉన్నారు.ఇంకా అంతమంది అభిమానులు ఉన్న భామ అప్పట్లోనే స్టార్ హీరోలతో సమానంగా ఆమె రెమ్యునరేషన్ తీసుకునేవారట.
దీంతో ఆమె ఆస్తులు అప్పటి లెక్కల ప్రకారమే దాదాపు 100 కోట్లు ఉన్నాయని కుటుంబ సభ్యులు చెప్పారు.ఇంకేముంది ఆమె మరణించడంతో ఆమె ఆస్తులపై గొడవలు భారీగానే జరిగాయి.2004లో ప్రారంభమైన ఆస్థి తగాదాలు 2014 వరకు జరిగాయి.ఆమె సోదరుడు కూడా సౌందర్యతో పాటే మరణించడంతో అతని భార్య, కొడుకు వారికీ హక్కు ఉందని కేసు వెయ్యగా.
లేదు వారు నకిలీవి సృష్టించారని సౌందర్య భర్త రఘు, తల్లి కోర్టును అసరియంచారు.అయితే కోర్టులో ఏళ్ళు గడుస్తున్నప్పటికీ సమస్య తీరకపోవడంతో 2013 డిసెంబర్ 3వ తేదికి రాజీకి వచ్చి ఆస్తులు సరిసమానంగా పంచుకున్నారు.
ఆమె ఆస్తులు ప్రస్తుతం ఎవరు అనుభవిస్తున్నప్పటికీ అలాంటి నటి తెలుగు పరిశ్రమకు దొరకడం అనేది అసాధ్యం.