నటీ నటులు జీవిత,రాజశేఖర్ ల కూమార్తెలు ఇద్దరూ కూడా టాలీవుడ్ కి పరిచయం అవ్వబోతున్న విషయం తెలిసిందే.ఈ క్రమంలో ఇద్దరూ కూడా తమ తమ డెబ్యూ మూవీ లతో బిజీ గా మారిపోయారు.
అయితే అనుకోకుండా పెద్ద కుమార్తె శివాని చిత్రం మధ్య లో ఆగిపోవడం తో ఇప్పుడు చిన్న కుమార్తె శివాత్మిక మాత్రం ‘దొరసాని’ చిత్రం ద్వారా తెలుగు ఇండస్ట్రీ కి పరిచయం కాబోతుంది.ఈ చిత్రంలో శివాత్మిక తో పాటు విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవర కొండ కూడా హీరో గా పరిచయం కాబోతున్నాడు.
మధుర ఎంటర్ టైన్మెంట్స్ నిర్మించిన ‘దొరసాని’ చిత్రం ఈనెల 12వ తారీకున రిలీజ్ కు సిద్దమైంది.అయితే ఈ చిత్రం ప్రమోషన్ లో భాగంగా శివాత్మిక ఒక ఇంటర్యూలో మాట్లాడుతూ నటిగా మారడానికి గల కారణాలను తెలిపింది.
చిన్నప్పటి నుంచి కూడా అమ్మా నాన్నలతో షూటింగ్స్ కు వెళ్లడం తో ఈ విధంగా నటి ని అవ్వాలి అన్న కోరిక వచ్చింది అని, అయితే ఫ్యామిలీ లో కూడా సినీ నేపధ్యమే ఉండడం తో తల్లి దండ్రులు కూడా ఎలాంటి షాక్ కు గురికాలేదు అని తెలిపింది.అలానె పీరియాడిక్ సినిమాలు అంటే చాలా ఇష్టం అని, బాలీవుడ్ లో సంజయ్ లీనా బన్సాలి ఇలాంటి పీరియాడిక్ మూవీస్ చేస్తారు అని ఆయన చిత్రాలను నేను చాలా ఇష్టపడతాను అని తెలిపింది.
అలానే నా తోలి చిత్రం అలాంటి పీరియాడిక్ మూవీ కావడం చాలా సంతోషంగా ఉందన్న శివాత్మిక ప్రేమ కథలు ఎప్పటికి పాతవి కావు, ఎప్పుడు చూసినా కూడా ప్రేమ కథల్లో కొత్తదనం ఉంటుంది.ప్రేమ కథలు ఎప్పటికి బోర్ కొట్టవు.అందుకే నేను ఈ ప్రేమ కథను ఎంపిక చేసుకున్నాను.దర్శకుడు ఈ చిత్రంలో చూపించిన ప్రేమ కథ చాలా విభిన్నంగా ఉంటుందని తెలిపింది.మరి శివాత్మిక చెప్పిన విషయాలు తెలియాలి అంటే ఈ నెల 12 వరకు ఆగాల్సిందే.