దాదాపు పాతిక సంవత్సరాల క్రితం తెలుగు సినిమా ఇండస్ట్రీలో నటి భానుప్రియ ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారు.అప్పటికి సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న భానుప్రియ బాటలోనే తన సోదరి శాంతి ప్రియ కూడా వెండితెర అరంగేట్రం చేశారు.
ఇలా 1991 లో అక్షయ్ కుమార్ సరసన సౌగంద్ అనే చిత్రం ద్వారా బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు శాంతి ప్రియ.
ఈమె ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన కొంతకాలానికే ఇండస్ట్రీకి దూరమయ్యారు.
అందుకు గల కారణం ఈమె పెళ్లి అని చెప్పవచ్చు.శాంతి ప్రియ నటుడు సిద్ధార్థ్ రేను వివాహం చేసుకున్నారు.
వివాహం తర్వాత ఈమెకు ఇద్దరు పిల్లలు పుట్టడం వల్ల పూర్తిగా సినీ జీవితానికి దూరం అవుతూ కేవలం పిల్లల బాధ్యతలను నిర్వర్తిస్తూ ఇంటికి మాత్రమే పరిమితమయ్యారు.
గత కొన్ని సంవత్సరాల క్రితం తన భర్త సిద్ధార్థ గుండెపోటుతో మరణించడం,ప్రస్తుతం తన పిల్లలు కూడా పెద్దవాళ్ళు కావడంతో ఈమె తిరిగి ఇండస్ట్రీలోకి రావాలనే ఆలోచన చేసినట్లు తెలుస్తోంది.
ఈ క్రమంలోనే శాంతి ప్రియ సుమారు ఇరవై ఏడేళ్ల తర్వాత మేకప్ వేసుకుని మహేష్ బాబు హీరోగా నటించిన మహర్షి సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి రీఎంట్రీ ఇచ్చారని తెలిపారు.ఈమె ప్రస్తుతం సమిత్ కక్కడ్ దర్శకత్వంలో జీ స్టూడియోస్ నిర్మాణంలో ధారవి బ్యాంక్ అనే వెబ్ సిరీస్ లో నటిస్తున్నట్లు వెల్లడించారు.