న్యాచురల్ స్టార్ నాని సమంత కాంబినేషన్ లో ఎటో వెళ్లిపోయింది మనస్సు, ఈగ సినిమాలు తెరకెక్కాయి.ఈ సినిమాలలో ఈగ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిస్తే ఎటో వెళ్లిపోయింది మనస్సు మాత్రం ఆశించిన స్థాయిలో సక్సెస్ సాధించలేదు.
అయితే సమంత నానికి జోడీగా మళ్లీ నటించనున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.ప్రస్తుతం సమంత వెకేషన్ కు దుబాయ్ వెళ్లి అక్కడే ఉన్నారు.
నాగచైతన్యతో విడాకుల ప్రకటన చేసిన తర్వాత సమంత ఆ బాధను మరిచిపోవడానికి ప్రయత్నిస్తున్నారు.
వరుసగా సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ కెరీర్ ను కొనసాగించాలని ఆమె అనుకుంటున్నారు.
శ్రీదేవి మూవీస్ బ్యానర్ లో ఒక సినిమాకు, డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్ లో ఒక సినిమాకు సమంత ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.ఈ సినిమాలతో పాటు సమంత నాని సినిమాకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చే ఛాన్స్ అయితే ఉందని తెలుస్తోంది.
నాని హీరోగా కొన్ని నెలల క్రితం దసరా అనే సినిమాకు సంబంధించిన ప్రకటన వెలువడిన సంగతి తెలిసిందే.
ఓదెల శ్రీకాంత్ అనే కొత్త డైరెక్టర్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.
ఎస్.ఎల్వీ సినిమాస్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొనగా ఈ సినిమాలో ఒక హీరోయిన్ గా కీర్తి సురేష్ ఇప్పటికే ఫైనల్ అయ్యారు.
ఈ సినిమాలో మరో హీరోయిన్ రోల్ కోసం మేకర్స్ సమంతను సంప్రదించారని తెలుస్తోంది.అయితే సమంత వైపు నుంచి గ్రీన్ సిగ్నల్ వస్తుందో లేదో చూడాల్సి ఉంది.
ఈ మధ్య కాలంలో సమంత ఎక్కువగా లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు మాత్రమే గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు.నాని, సమంత మరోసారి కలిసి నటిస్తే బాగుంటుందని ప్రేక్షకులు కోరుకుంటున్నారు.సమంత నాని సినిమాలో నటించడానికి ఓకే చెబితే మాత్రం మరికొన్ని కొత్త సినిమాలలో నటించే అవకాశం ఆమెకు దక్కుతుందని చెప్పవచ్చు.