ప్రముఖ సినీ నటి, వైసీపీ ఎమ్మెల్యే రోజా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల గురించి స్పందించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు జనరల్ ఎలక్షన్స్ ను తలపిస్తున్నాయని రోజా అభిప్రాయపడ్డారు.
ఈరోజు ఉదయం ఒక కార్యక్రమంలో పాల్గొన్న రోజా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు ప్రస్తుతం అంతటా చర్చనీయాంశం అయ్యాయని కామెంట్లు చేశారు.ఎవరికి ఓటు వేస్తారనే అంశంపై గురించి కూడా రోజా స్పందించారు.
గత ఎన్నికలకు భిన్నంగా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు హోరాహోరీగా జరుగుతున్నాయని రోజా అభిప్రాయపడ్డారు.లోకల్, నాన్ లోకల్ ఇష్యూ గురించి తాను ఎటువంటి కామెంట్లు చేయనని రోజా తెలిపారు.
ప్రకాష్ రాజ్, విష్ణు ప్యానెళ్లకు సంబంధించిన మ్యానిఫెస్టోలను తాను చూశానని ఏ ప్యానల్ అయితే అభివృద్ధి చేస్తుందని తాను నమ్ముతున్నానో వారికి మాత్రమే తాను ఓటు వేస్తానని రోజా వెల్లడించారు.
హైదరాబాద్ లో ని జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్ లో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు జరగనున్నాయి.
ప్రకాష్ రాజ్, మంచు విష్ణు గెలవడం కోసం తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు.ఎన్నికల్లో ఎవరు గెలుస్తారనే ప్రశ్నకు ఖచ్చితమైన సమాధానాన్ని ఎవరూ చెప్పలేకపోతున్నారు.ప్రకాష్ రాజ్, మంచు విష్ణు జోరుగా ప్రచారంలో పాల్గొంటూ గెలుపు కోసం తమ వంతు కృషి చేస్తున్నారు.
920కు పైగా ఓట్లు ఉన్న మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లో ఎంతమంది ఓటు హక్కును వినియోగించుకుంటారో దానిని బట్టి ఎవరు విజయం సాధిస్తారో తెలిసే అవకాశం ఉంటుంది.రోజా ఎవరికి మద్దతు ఇస్తారనే విషయాన్ని డైరెక్ట్ గా చెప్పకపోయినా పోటీ చేస్తున్న వ్యక్తులలో ఒకరు వైసీపీ పార్టీకి సన్నిహిత వ్యక్తి కావడం, జగన్ బంధువు కావడంతో అతనికే రోజా ఓటు వేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.