సినిమాల్లో హీరోయిన్స్ ను చూస్తుంటే అతిలోక సుందరిలా, అతి సుకుమారంగా, ముట్టుకుంటే కందిపోయేలా కనిపిస్తుంటారు.వాళ్ళు అందాన్ని ఎలా కాపాడుకుంటారో అని అనుకుంటూ ఉంటాము.
కానీ, ఇప్పుడు కాలం మారింది.కాలంతో పాటు ఆడవాళ్ళ ఆలోచనలు కూడా మారుతున్నాయి.
సుకుమారంగా ఉండే హీరోయిన్స్ వర్కౌట్లు చేసి.యోగాలు చేసి హీరోల కంటే దృడంగా మారుతున్నారు.
ఇప్పుడు ఈ కోవలోకి చెందిన హీరోయిన్సలో రెజీనా కసాండ్రా కూడా జాయిన్ అయ్యారు.ఎప్పటికప్పుడు సాహస యాత్రలు, ఛాలెంజింగ్ టాస్క్ లు చేస్తూ సోషల్ మీడియాలో నిలుస్తూ ఉంటుంది.
అయితే ఇటీవల ఈమె ఏకంగా ఆమె 104 కిలోమీటర్లు సైకిల్ రైడ్ లో పాల్గొని అందరి దృష్టిని ఆకర్షించింది.
క్యాన్సర్ అవగాహనలో భాగంగా , ఫండ్ రైజింగ్ కోసం ఒక ఎన్జీవో కశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు సైకిల్ రైడ్ ను ప్రారంభించారు.
ఆ అమ్మాయిల రైడ్ లో హీరోయిన్ రెజీనా కూడా పాల్గొనడం విశేషం.రెజీనా హైదరాబాద్ నుండి మహబూబ్ నగర్ వరకు 104 కిలో మీటర్ల మేరకు ప్రొఫెషనల్ రైడర్స్ తో కలిసి వారితో సమానంగా సైకిల్ ను రైడ్ చేసింది.
వైల్డ్ వారియర్ హిమాలయన్ అడ్వెంచర్ రేస్ పేరుతో సాగుతున్న ఈ ఛారిటీ కార్యక్రమంలో భాగంగా రెజీనా తనవంతు భాగస్వామ్యం అవ్వడంతో నిర్వాహకులు ఆనందం వ్యక్తం చేశారు.అభిమానులు సైతం పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.
హీరోయిన్ అయ్యి ఉండి, ఎలాంటి డాబు, దర్పం లేకుండా ఒక సామాన్య లేడీగా ఇంత భారీ రేస్ లో పాల్గొనడం చాలా అరుదుగా చూస్తూ ఉంటాం.గతంలో కూడా రెజీనా రేస్ లో పాల్గొన్న సందర్బాలున్నాయి.ఇక ఈమె సినిమాల విషయానికి వస్తే మెగాస్టార్ చిరంజీవి ‘ఆచార్య’ సినిమాలో ప్రత్యేక పాటలో నటించడంతో పాటు రెండు లేడీ ఓరియంటెడ్ సినిమాల్లో కూడా నటిస్తోంది.సినిమాల్లో నటిస్తునే తన వంతు బాధ్యతగా సామజిక సేవ చేయడం పట్ల రెజీనాను అందరు అభినందిస్తున్నారు.