40 రూపాయలు ఇవ్వమని అడుగుతున్న రాశీఖన్నా.. అసలేమైందంటే..?

ఊహలు గుసగుసలాడే సినిమాతో రాశీఖన్నా టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే.తొలి సినిమాతోనే సక్సెస్ ను సొంతం చేసుకున్న ఈ బ్యూటీకి ఆ తరువాత స్టార్ హీరోల సినిమాల్లో కూడా ఆఫర్లు వచ్చాయి.

 Heroine Rashi Khanna Request To Fans Supports Roti Banks Money, 40 Rupees Donati-TeluguStop.com

అయితే నటించిన సినిమాలు భారీ బ్లాక్ బస్టర్ హిట్లు కాకపోవడం వల్ల అడపాదడాపా ఆఫర్లతో రాశీఖన్నా సినిమాల్లో నటిగా కెరీర్ ను కొనసాగిస్తున్నారు.అయితే ఈ బ్యూటీ సేవా కార్యక్రమాల ద్వారా తన గొప్ప మనస్సును చాటుకుంటున్నారు.

ఫస్ట్ వేవ్ తో పోలిస్తే సెకండ్ వేవ్ లో వైరస్ శరవేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ప్రతిరోజూ 50,000కు పైగా కొత్త కేసులు 2,000కు పైగా మరణాలు నమోదవుతున్నాయి.కరోనా బారిన పడకుండా ఉండాలనే ఉద్దేశంతో పలు రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్, కర్ఫ్యూ నిబంధనలను అమలు చేస్తున్నాయి.

బయటకు వెళ్లే సమయంలో డబుల్ మాస్క్ ను వినియోగించాలని నిపుణులు చెబుతుండటం గమనార్హం.

లాక్ డౌన్ నిబంధనల అమలు వల్ల ఆకలితో అలమటిస్తున్న వాళ్ల సంఖ్య అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం.ఇలా కరోనా వ్లల కష్టాలు పడుతున్న వాళ్ల కోసం రాశీఖన్నా రోటీ ఫౌండేషన్ తో కలిసి పని చేస్తున్నారు.తాజాగా రాశీఖన్నా ఒక వీడియోను రిలీజ్ చేసి పేదవాడి కడుపు నింపడం కొరకు 40 రూపాయలు డొనేషన్ ఇస్తే చాలని తెలిపారు.

రాశీఖన్నా తక్కువ మొత్తంలో విరాళం కోరడంతో పెద్దసంఖ్యలో నెటిజన్లు విరాళాలు ఇస్తున్నారు.

ఆకలితో బాధ పడుతున్న వాళ్లకు రాశీఖన్నా స్వయంగా విరాళాలను అందించడం గమనార్హం.రాశీఖన్నా ఆకలితో అలమటించే వాళ్లకు సొంతంగా రోటీలను అందించారు.మిగతా వాటితో పోలిస్తే ఆకలి భయంకరమైన రాక్షసి అని రాశీఖన్నా చెప్పుకొచ్చారు.

దాతలు ముందుకు వస్తే ఎక్కువమంది సాయం చేయడం సాధ్యమవుతుందని రాశీఖన్నా తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube