ఇప్పుడంటే మల్టీస్టారర్ సినిమాలు బాగా తగ్గిపోయాయి కానీ గతంలో పదుల సంఖ్యలో ఇద్దరు హీరోయిన్లు లేదా ఇద్దరు హీరోలు కలిసి నటించిన సినిమాలు విడుదలవుతూ ఉండేది.ఎంత ఎక్కువ మంది నటీనటులు ఉంటే అంత బాగా మార్కెట్ చేసుకోవచ్చు అనేది అప్పటి దర్శకుల ఆలోచన.
అందుకే ఎంత పెద్ద స్టార్ హీరో అయినా సరే మరొక స్టార్ హీరోతో నటించడానికి ఆసక్తి చూపుతుండేవారు.అయితే ఇలా ఇద్దరు కలిసి నటించిన సినిమాల్లో అప్పుడప్పుడు వివాదాలు కూడా జరుగుతూ ఉండేది.
హీరోయిన్ రాధిక మరియు రాధా మధ్య రెమ్యునరేషన్ విషయంలో జరిగిన సంఘటన అసోసియేషన్ వరకు వెళ్లడంతో పెద్ద రచ్చకు దారితీసింది.మరి ఆ ఇద్దరి మధ్య జరిగిన ఆసక్తికరమైన సంగతి ఏంటో ఈ ఆర్టికల్లో తెలుసుకుందాం.
రాధిక మరియు రాధ ఇద్దరు నటిమనులు ప్రస్తుతం బుల్లితెరపై బాగా సందడి చేస్తున్నారు.అయితే గతంలో వీరిద్దరూ కలిసి అనేక సినిమాల్లో నటించారు.కానీ ఒక సినిమాకి సంబంధించి జరిగిన గొడవ వల్ల వారు ఆ తర్వాత కలిసి నటించడం మానేశారు.వీరిద్దరూ కలిసి నటించిన ఒక సినిమా కోసం ఎక్కువగా మరొకరికి తక్కువగా పారితోషికం మాట్లాడుకున్న తర్వాత ఈ విషయం తెలియకుండా ఇద్దరు నటించారు.
నిర్మాత మొదట ఈ విషయం బయటకు రాకుండా జాగ్రత్తపడ్డాడు.కానీ సినిమా ముగించిన తర్వాత ఎవరో ఈ విషయాన్ని రాధికకు ఉప్పందించారు.రాధకు రెమ్యునరేషన్ ఐదు లక్షలకు పైగా ఎక్కువ ఇచ్చినట్టుగా ఆమెకు సమాచారం అందింది.
దాంతో రాధిక సదరు నిర్మాతతో గొడవకు దిగింది అంతేకాదు తానే ఎక్కువ సన్నివేశాల్లో నటించాను కానీ తక్కువ పారితోషకం అందుకున్నానని ఏకంగా అసోసియేషన్ కి ఫిర్యాదు చేయడంతో ఈ విషయం మరింత పెద్దగా అవ్వకముందే దాసరి నారాయణరావు జోక్యం చేసుకున్నారు.నిర్మాతను పిలిచి విషయం అడగడంతో ఆయన రాధకు ఎక్కువగా డబ్బులు ఇచ్చిన విషయం ఒప్పుకున్నాడు.దాంతో దాసరి ఆగ్రహానికి గురై రాధికకు అదే రోజు మరొక మూడు లక్షలు ఇప్పించి గొడవను సద్దుమణిగేలా చేశారట.
ఆ తర్వాత ఈ ఇద్దరు హీరోయిన్లు మరే సినిమాలను కలిసి నటించలేదు.