తెలుగు, తమిళంతో పాటు ఇతర భాషల్లో నటించి మంచి పేరు సంపాదించుకున్న రాయ్ లక్ష్మీ పెళ్లికి సంబంధించి గత కొంతకాలంగా వార్తలు వైరల్ అవుతున్నాయి.గతేడాది లాక్ డౌన్ సమయంలో టాలీవుడ్, కోలీవుడ్ కు చెందిన చాలామంది సెలబ్రిటీలు పెళ్లి పీటలెక్కారు.
రాయ్ లక్ష్మీ కూడా ఈ ఏడాది పెళ్లి పీటలెక్కనున్నారు.పెళ్లికి సంబంధించిన ప్రశ్నలు ఎదురవుతూ ఉండటంతో తాజాగా రాయ్ లక్ష్మీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
తనకు సంబంధించి కొంతమంది నుంచి ఎదురవుతున్న ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలని తాను అనుకుంటున్నానని ఆమె తెలిపారు.తాను రిలేషన్ షిప్ గురించి దాచాలని అనుకోవడం లేదని ఆమె పేర్కొన్నారు.
ఇతరులకు తన రిలేషన్ షిప్ కు సంబంధించిన విషయాలను చెప్పాల్సిన అవసరం లేదని ఆమె అన్నారు.తను ఎవరినైతే పెళ్లి చేసుకోవాలని అనుకుంటానో ఆ వ్యక్తికి సంబంధించిన విషయాలను బయటపెట్టాలని అనుకోవడం లేదని రాయ్ లక్ష్మీ పేర్కొన్నారు.
ఈ నెల 27వ తేదీన తన నిశ్చితార్థం జరగబోతుందని.కొన్ని రోజుల క్రితమే బంధుమిత్రులకు నిశ్చితార్థ వేడుకకు సంబంధించిన ఇన్విటేషన్ ను పంపామని ఆమె తెప్పారు.నిశ్చితార్థ వేడుక అకస్మాత్తుగా జరుగుతోందని.ఎప్పుడో ప్లాన్ చేసుకుని తాను నిశ్చితార్థ వేడుకను జరుపుకోవడం లేదని రాయ్ లక్ష్మీ వెల్లడించారు.తన ఎంగేజ్ మెంట్, పెళ్లి విషయంలో కుటుంబ సభ్యులు ఎంతో సంతోషంగా ఉన్నారని ఆమె పేర్కొన్నారు.
తన లవ్ తో లైఫ్ ను పంచుకోవడం కోసం తాను ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని ఆమె వెల్లడించారు.
ఈ నెల నిశ్చితార్థ వేడుక జరుగుతుండటంతో మే నెలలో పెళ్లి వేడుక జరిగే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.అయితే రాయ్ లక్ష్మి ఎవరిని పెళ్లి చేసుకోబోతున్నారనే విషయం తెలియాల్సి ఉంది.
ఈ మధ్య కాలంలో ఖైదీ నంబర్ 150 సినిమాలోని రత్తాలు పాటతో రాయ్ లక్ష్మీ గుర్తింపును సంపాదించుకున్న సంగతి తెలిసిందే.