నందమూరి బాలకృష్ణ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘అఖండ’ ఇప్పటికే ప్రేక్షకుల్లో ఎలాంటి అంచనాలు క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే.ఈ సినిమాను మాస్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుంటుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.
ఇక ఈ సినిమాతో బోయపాటి-బాలయ్య కాంబో హ్యా్ట్రిక్ విజయాన్ని అందుకోవడం ఖాయమని చిత్ర వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి.
అయితే ఈ సినిమా మొదట్లో బాలయ్య సరసన హీరోయిన్గా ఎవరు నటిస్తారా అనేది పెద్ద సస్పెన్స్గా మారింది.
బాలయ్య సరసన నటించేందుకు హీరోయిన్లు ఎవరూ ఆసక్తి చూపకపోవడం మనకు తెలిసిందే.కాగా అందాల భామ ప్రగ్యా జైస్వాల్ ఈ సినిమాలో హీరోయిన్గా కన్ఫం అయిన సంగతి తెలిసిందే.
ఇక బాలయ్య నెక్ట్స్ చిత్రానికి కూడా ఇదే తరహా సమస్య వస్తున్నట్లు తెలుస్తోంది.క్రాక్ చిత్రంతో అదిరిపోయే హిట్ అందుకున్న దర్శకుడు గోపీచంద్ మలినేని తన నెక్ట్స్ చిత్రాన్ని బాలయ్యతో తెరకెక్కించనున్న సంగతి తెలిసిందే.
ఇప్పుడు ఈ సినిమాలో హీరోయిన్ విషయం కూడా చిత్ర యూనిట్కు పెద్ద తలనొప్పిగా మారింది.క్రాక్ హీరోయిన్ శృతి హాసన్ను ఈ సినిమాలో తీసుకోవాలని దర్శకుడు భావించినా, కొన్ని కారణాల వల్ల అది కుదర్లేదు.
దీంతో మరో బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ను ఈ సినిమాలో హీరోయిన్గా తీసుకునేందుకు చిత్ర యూనిట్ ప్రయత్నించింది.కానీ బాలయ్య సరసన నటించేందుకు రకుల్ కూడా నో చెప్పడంతో, ఇప్పుడు ఈ సినిమాలో హీరోయిన్గా ఎవరు ఫైనల్ అవుతారా అనేది ఆసక్తికరంగా మారింది.
ఏదేమైనా బాలయ్యకు ఇలా వరుసగా హీరోయిన్ సమస్యలు రావడంతో ఆయన అభిమానులు కాస్త ఆందోళన చెందుతున్నారు.మరి బాలయ్య సినిమాల్లో హీరోయిన్గా నటించేందుకు స్టార్ బ్యూటీలు ఎందుకు ముందుకు రావడం లేదనే విషయం సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.