తెలుగులో ఎక్కువ సంఖ్యలో సినిమాలు చేసినా స్టార్ హీరోయిన్ స్టేటస్ ను అందుకోని హీరోయిన్లలో ప్రియమణి( priyamani ) ఒకరు.రాజమౌళి( Rajamouli ) డైరెక్షన్ లో యమదొంగ సినిమాలో నటించినా ప్రియమణి జాతకం మాత్రం మారలేదనే సంగతి తెలిసిందే.
ఈ మధ్య కాలంలో తెలుగులో ప్రియమణి ఎక్కువ సంఖ్యలో సినిమాలలో నటించడం లేదు.గతంతో పోల్చి చూస్తే ఈ హీరోయిన్ కు మూవీ ఆఫర్లు తగ్గాయి.
తాజాగా ఈ నటి సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ హాట్ టాపిక్ అవుతోంది.కోరిక తీర్చుకోవడం కోసం కుక్కల్ని కూడా వదలరా అనే అర్థం వచ్చేలా ప్రియమణి పోస్ట్ ( Priyamani’s post )చేయడం గమనార్హం.
బీహార్ రాష్ట్రంలో చోటు చేసుకున్న ఘటన గురించి ప్రియమణి ఈ విధంగా రియాక్ట్ అయ్యారు.బీహార్ లోని పాట్నాలో ఒక వ్యక్తి కుక్కపై అత్యాచారం చేయగా ఈ ఘటన తన దృష్టికి రావడంతో ప్రియమణి ఘాటుగా స్పందించారు.
ఈ ఘటన చాలా అసహ్యకరంగా ఉందని ఆమె చెప్పుకొచ్చారు.ఇలాంటి ఘటనల గురించి స్పందించడానికి కూడా కొందరు సెలబ్రిటీలు ఆసక్తి చూపడం లేదు.ఐదేళ్ల క్రితం ప్రియమణి పెళ్లి జరగగా పెళ్లి తర్వాత పలు వివాదాల ద్వారా ప్రియమణి వార్తల్లో నిలిచారు.సినిమాల ద్వారా ప్రియమణి బాగానే సంపాదించారని సమాచారం.నందమూరి హీరోలలో దాదాపుగా అందరు హీరోలకు ప్రియమణి జోడీగా నటించారు.
అయితే నటిగా ప్రియమణి సక్సెస్ రేట్ తక్కువనే సంగతి తెలిసిందే.కొన్ని సినిమాలలో ప్రియమణి గ్లామర్ రోల్స్ లో నటించగా ఆ సినిమాలు కూడా ఆశించిన రేంజ్ లో విజయాన్ని సొంతం చేసుకోలేదు.ప్రియమణి సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా వరుస విజయాలతో సత్తా చాటాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
హీరోయిన్ ప్రియమణి కెరీర్ విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు.