సినిమా ఇండస్ట్రీలో హీరోహీరోయిన్లు ఒకే సినిమాలో నటిస్తే వాళ్లిద్దరి మధ్య ఏం లేకపోయినా ఏదో ఉందని గాసిప్స్ అప్పుడప్పుడూ వైరల్ అవుతూ ఉంటాయి.12 సంవత్సరాల క్రితం తరుణ్, ప్రియమణి హీరోహీరోయిన్లుగా నటించిన నవవసంతం సినిమా షూటింగ్ సమయంలో తరుణ్, ప్రియమణి ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారని పెళ్లి చేసుకోబోతున్నారని ప్రచారం జరిగింది.ప్రియమణి స్పందించి స్పష్టతనిచ్చినా ఆ ప్రచారం ఆగలేదు.
తరుణ్, ప్రియమణి ఒకరికొరకు ఖరీదైన బహుమతులను, కార్లను ఇచ్చిపుచ్చుకున్నారని కూడా ప్రచారం జరిగింది.
ప్రియమణి టయోటా ఇన్నోవా కారు కొనుక్కోగా తరుణ్ ఆ కారును కొని ఇచ్చారని గాసిప్స్ వినిపించాయి.అయితే మూడేళ్ల క్రితం ప్రియమణి ముస్తఫా రాజ్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకోవడంతో ఆ పుకార్లు ఆగిపోయాయి.
అయితే గతంలో తరుణ్ తో పెళ్లి గురించి వైరల్ అయిన వార్తలపై తాజాగా ఒక ఇంటర్వ్యూలో ప్రియమణి సంచలన వ్యాఖ్యలు చేసింది.
నవవసంతం సినిమా సమయంలో తరుణ్ తో ప్రేమతో ఉన్నట్లు వార్తలు వచ్చాయని.తరుణ్ తల్లి రోజా రమణి షూటింగ్ సమయంలో తనను కలిసి తరుణ్ కు తనకు మధ్య ఉన్న ప్రేమను అంగీకరిస్తున్నట్టు చెప్పారని.ఆమె మాటలు విని తాను అవాక్కయ్యానని అన్నారు.
ఏమీ లేకపోయినా తనకు, తరుణ్ కు మధ్య ఏదో తాను వెంటనే తన తండ్రికి ఫోన్ చేసి జరిగిన విషయాన్ని వెల్లడించారు.
తరుణ్ తో ప్రేమాయణం నడుపుతున్నానని పుకార్లు వస్తున్నాయని ఒక జర్నలిస్ట్ కూడా తన దృష్టికి తెచ్చాడని అన్నారు.
టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్లలో తరుణ్ కూడా ఒకరు.మొదట్లో తరుణ్ ఆర్తి అగర్వాల్ తో ప్రేమాయణం నడిపినట్టు వార్తలు వైరల్ అయ్యాయి.
తరుణ్ పెళ్లి చేసుకుంటే మాత్రమే ఈ పుకార్లు ఆగే అవకాశం ఉంది.
తాజా వార్తలు