ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ లిస్టులో బుట్ట బొమ్మ పూజా హెగ్డే ఒకరు.ఈమె దక్షిణాది సినీ ఇండస్ట్రీ లోనే కాకుండా బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా పలు సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు.
కేవలం సినిమా ఇండస్ట్రీలో మాత్రమే కాకుండా సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన విషయాలన్నింటినీ అభిమానులతో పంచుకునే పూజా రోజురోజుకు ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకుంటున్నారు.
ఇదిలా ఉండగా తాజాగా పూజా హెగ్డే తన మాల్దీవులకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు.
దీంతో ఈమెకు మరింత మంది అభిమానులు పెరిగారు.తన అభిమానులు అడిగిన వెంటనే బికినీ ఫోటోలను షేర్ చేసిన బుట్ట బొమ్మ తన అభిమానులను ఎంతగానో సందడి చేసిందని చెప్పవచ్చు.
ఇదిలా ఉండగా తాజాగా సోషల్ మీడియా వేదికగా పూజా హెగ్డే స్పందిస్తూ నిద్ర లేవగానే తన ఫోన్లో అది చూసి ఎంతో షాకయ్యాను అని తెలియజేశారు.ఇంతకీ ఏం జరిగింది అనే విషయానికి వస్తే.
పూజా హెగ్డే ఉదయం నిద్రలేవగానే తన ఫోన్ లో తన ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ సంఖ్య ఏకంగా 16 మిలియన్ కి చేరుకోవడం చూసి ఈమె ఎంతో సంబరపడ్డారు.ఈ ఆనందంలో ఏకంగా బెడ్ పైనే చిందులు వేశారు.
ఇలా ఒక్కసారిగా 16 మిలియన్ ఫాలోవర్స్ రావడం చూసి షాక్ అయ్యానని ఈ సందర్భంగా పూజా హెగ్డే తెలియజేస్తూ తన సంతోషాన్ని వ్యక్తపరిచారు.ప్రస్తుతం ఈమె నటించిన ఆచార్య, రాధేశ్యామ్ చిత్రాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.