టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా తిరుగులేని హవా కొనసాగిస్తున్న అందాల భామ పూజా హెగ్డే తన కలని సాకారం చేసుకోవడానికి సిద్ధమైంది.బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ కావాలనే తన ప్రయత్నంకి ఇన్ని రోజుల తర్వాత ఫలితం దక్కేలా కనిపిస్తుంది.
సౌత్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి తరువాత బాలీవుడ్ లో మొదటి సినిమానే హృతిక్ రోషన్ లాంటి స్టార్ తో చేసిన ఆమెకి లక్ ఫెవర్ చేయలేదు.దీంతో తిరుగుటపా మీద మళ్ళీ డీజే సినిమాతో టాలీవుడ్ లో పెట్టి వెనక్కి తిరిగి చూసుకునే అవకాశం లేకుండా వరుస సినిమాలు చేస్తూ వచ్చింది.
వరుస హిట్స్ తో జోరు మీద ఉన్న ఈ భామ ప్రస్తుతం పాన్ ఇండియా మూవీ రాధేశ్యామ్, అఖిల్ తో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచలర్ సినిమాలు చేస్తుంది.ఈ రెండు వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకి రానున్నాయి.
ఇదిలా ఉంటే వచ్చే ఏడాది ఆమె ఏకముగా మూడు హిందీ ప్రాజెక్ట్ లని లైన్ లో పెట్టింది.అలాగే తమిళంలో ఒక సినిమాకి వచ్చే చెప్పింది.
త్రివిక్రమ్, ఎన్ఠీఆర్ సినిమా కోసం పూజా పేరు వినిపిస్తుంది.
ఇదిలా ఉంటే క్రేజ్ ఉన్నప్పుడే నటిగా కూడా బెస్ట్ అనిపించుకునే సినిమాలు చేయాలని అనుకుంటున్న పూజా హెగ్డే అలాంటి కథల కోసం చూస్తుందని తెలుస్తుంది.ఈ నేపధ్యంలో గుణశేఖర్ పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కించబోతున్న ప్రేమకావ్యం శాకుంతలం సినిమాలో టైటిల్ రోల్ కోసం పూజా హెగ్డేతో మాట్లాడుతున్నట్లు తెలుస్తుంది.పౌరాణికానికి చెందిన ఆ పాత్ర కూడా చాలా ఇంటెన్సిటీ ఉన్నదీ కావడం, అలాగే ఫీమేల్ సెంట్రిక్ గా ఉండటంతో పూజా చేయడానికి ఆసక్తి చూపించిందని ఇండస్ట్రీలో టాక్.
త్వరలో దీనికి సంబంధించి గుణశేఖర్ నుంచి క్లారిటీ వచ్చే అవకాశం ఉందని బోగట్టా. పూజా హెగ్డే కూడా కాస్తా వేరియేషన్ కావాలని ఫీమేల్ సెంట్రిక్ స్టోరీ అయిన శాకుంతలం చేయడానికి ఒకే చెప్పిందని టాక్ వినిపిస్తుంది.