టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా వరుస అవకాశాలతో బిజీగా ఉన్న పూజా హెగ్డే ఈ మధ్య కాలంలో వివాదాల ద్వారా వార్తల్లో నిలుస్తోంది.ఇటీవల ఒక ఇంటర్వ్యూలో దక్షిణాది ప్రేక్షకులను కించపరిచి వార్తల్లో నిలిచిన పూజా హెగ్డే ఆ తరువాత వివరణ ఇచ్చుకుంది.
అయితే తాజాగా ఆమె అరవింద సమేత సినిమా గురించి చేసిన కామెంట్ల వల్ల మరోమారు వివాదంలో చిక్కుకున్నారు.ఇటీవల పూజా హెగ్డే ఒక ఇంటర్వ్యూలో పాల్గొని అరవింద సమేత తన కెరీర్ లోనే ప్రత్యేక చిత్రమని చెప్పారు.
జూనియర్ ఎన్టీఆర్ తో నటించడం గొప్ప అనుభూతిని ఇచ్చిందని పూజా హెగ్డే అన్నారు.అయితే ఎన్టీఆర్ ను, ఎన్టీఆర్ సినిమాను ప్రశంసించడంలో తప్పేం లేకపోయినా ఇతర హీరోల గురించి, ఇతర హీరోల సినిమాల గురించి పూజా హెగ్డే మాట్లాడలేదు.
దీంతో అల్లు అర్జున్ ఫ్యాన్స్, మహేష్ ఫ్యాన్స్ పూజా హెగ్డేపై ఫైర్ అవుతున్నారు.ఒక లైలా కోసం సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన పూజా హెగ్డేకు డీజే సినిమాతో తొలి హిట్ వచ్చింది.
డీజే సినిమానే పూజా హెగ్డేకు స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చింది.ఆ సినిమా తరువాత అల వైకుంఠపురములో సినిమాతో అల్లు అర్జున్, పూజా హెగ్డే ఖాతాలో మరో బ్లాక్ బస్టర్ హిట్ చేరింది.అయితే రెండు హిట్లు ఇచ్చినా అల్లు అర్జున్ గురించి చెప్పకపోవడంతో బన్నీ ఫ్యాన్స్ హర్ట్ కావడంతో పాటు ఆమెను సోషల్ మీడియా వేదికగా ట్రోల్ చేస్తున్నారు.మహర్షి సినిమా గురించి చెప్పకపోవడంతో మహేష్ ఫ్యాన్స్ కూడా హర్టయ్యారు.
ఈ వివాదం గురించి పూజా హెగ్డే స్పందిస్తుందో లేదో చూడాల్సి ఉంది.వరుస వివాదాలు పూజా హెగ్డే కెరీర్ పైనే ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయి.
స్టార్ హీరోయిన్ గా మంచి పేరు వస్తున్న వస్తున్న తరుణంలొ ఇలాంటి వివాదాలు పూజాపై ప్రేక్షకుల్లో నెగిటివిటీ పెంచే అవకాశం ఉంది.ఇకముందైనా పూజా హెగ్డే వివాదాలకు తావివ్వకుండా ఉంటే మంచిది.