టాలీవుడ్ స్టార్ హీరోల్లో కోట్ల సంఖ్యలో అభిమానులను సంపాదించుకోవడంతో పాటు సినిమాసినిమాకు తన స్థాయిని పెంచుకుంటున్న నటుల్లో తారక్ ఒకరు.ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ సినిమాలో రామ్ చరణ్ తో కలిసి ఎన్టీఆర్ నటిస్తున్నారు.
కెరీర్ తొలినాళ్ల నుంచి వివాదాలకు దూరంగా ఉన్న తారక్ క్యారెక్టర్ ను తప్పుబడుతూ ఒక డైరెక్టర్ కామెంట్లు చేశాడని పాయల్ ఘోష్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
బాలీవుడ్ ప్రముఖ దర్శకులలో ఒకరైన అనురాగ్ కశ్యప్ గురించి పాయల్ ఘోష్ కొన్ని రోజుల క్రితం లైంగిక ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.
తాజాగా పాయల్ తనకు ఎదురైన ఒక చేదు అనుభవం గురించి చెప్పుకొచ్చింది.ఒక సినిమా చర్చల్లో భాగంగా తాను అనురాగ్ కశ్యప్ ను కలిశానని.
ఆ సమయంలో మేనేజర్ సూచనల మేరకు టీవీలో ప్రసారమవుతున్న ఊసరవెల్లి సినిమాను రెఫరెన్స్ గా చూపించానని అన్నారు.
ఆ సమయంలో అనురాగ్ “ఎన్టీఆర్ కూడా నిన్ను వాడాడు.సతీసావిత్రిలా నటించకు” అని నీచమైన వ్యాఖ్యలు చేశాడని పేర్కొన్నారు. ఎన్టీఆర్ క్యారెక్టర్ ను అవమానించే విధంగా అనురాగ్ మాట్లాడాడని ఆమె చెప్పుకొచ్చారు.
తారక్ ఎంతో మంచివాడని.అలాంటి వ్యక్తి గురించి అనురాగ్ ఇష్టానుసారం వ్యాఖ్యలు చేశాడని పాయల్ పేర్కొన్నారు.
సౌత్ ఇండియాలోని స్టార్ సినిమాల్లో మంచి వాతావరణం ఉంటుందని ఎన్టీఆర్ తనతో ఎప్పుడూ తప్పుగా ప్రవర్తించలేదని ఆమె అన్నారు.పాయల్ ఘోష్ ఎన్టీఆర్ అభిమానులు అనురాగ్ కశ్యప్ పై మండిపడుతున్నారు.
మరి కొందరు మాత్రం ఎన్టీఆర్ ను అనవసరమైన వివాదాల్లోకి లాగుతున్నారంటూ కామెంట్లు చేస్తున్నారు.పాయల్ ఘోష్ ఊసరవెల్లి సినిమాలో తమన్నా ఫ్రెండ్ పాత్రలో నటించిన సంగతి తెలిసిందే.
ఈ సినిమా యావరేజ్ ఫలితాన్ని అందుకున్నప్పటికీ పాయల్ పాత్రకు మంచి పేరు వచ్చింది.