నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం తన తాజా చిత్రాన్ని మాస్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను డైరెక్షన్లో తెరకెక్కిస్తున్నాడు.ఇప్పటికే షూటింగ్ కూడా మొదలుపెట్టుకున్న ఈ సినిమా ప్రస్తుతం కరోనా వైరస్ కారణంగా షూటింగ్ వాయిదా వేసింది.
కాగా ఈ సినిమాతో మరోసారి బాలయ్య తనదైన మార్క్ వేసేందుకు రెడీ అవుతున్నాడు.
ఈ క్రమంలో బాలయ్యతో పాటు బోయపాటి కూడా ఎట్టిపరిస్థితుల్లో హిట్ కొట్టాలని ప్లాన్ చేస్తున్నాడు.
ఈ సినిమా ఇద్దరికీ చాలా కీలకం కావడంతో ఎలాగైనా తిరిగి ఫాంలోకి రావాలని చూస్తున్నారు.ఇక ఈ సినిమాలో బాలయ్య రెండు విభిన్న పాత్రల్లో నటిస్తాడని, అందులో ఒకటి అఘోరా పాత్ర కూడా ఉందని తెలుస్తోంది.
కాగా ఈ సినిమాలో హీరోయిన్ ఎవరనే అంశం పెద్ద తలనొప్పిగా మారింది.ఇప్పటికే ఈ సినిమాలో శ్రియా సరన్ నటిస్తోందని వార్తలు వచ్చినా అది ఇంకా కన్ఫమ్ కాలేదట.
అటు మిగతా హీరోయిన్లు ఎవరూ కూడా ఈ సినిమాలో నటించేందుకు ఆసక్తి చూపించడం లేదని, దీంతో బాలయ్య అండ్ టీమ్ చాలా ఆందోళన చెందుతున్నారని తెలుస్తోంది.మరి ఈ సినిమాలో బాలయ్య సరసన హీరోయిన్గా ఎవరు నటిస్తారో అనే అంశం ప్రస్తుతం టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది.