15 సంవత్సరాల క్రితం సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చినా ఎప్పుడూ సినిమాలతో బిజీగా ఉండే స్టార్ హీరోయిన్ నయనతార.లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో సైతం రికార్డు స్థాయిలో కలెక్షన్లు రాబట్టడం నయనతార ప్రత్యేకత.
తమిళ, తెలుగు, మలయాళ భాషల్లో స్టార్ హీరోయిన్ అనిపించుకున్న నయనతార టాలీవుడ్ ను చిన్న చూపు చూస్తోందని సోషల్ మీడియాలో కామెంట్లు వ్యకమవుతున్నాయి. గతేడాది సైరా నరసింహారెడ్డి సినిమాలో కనిపించిన నయనతార ఆ సినిమా తరువాత మరే తెలుగు సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు.
టాలీవుడ్ నిర్మాతలు, దర్శకులు తమ సినిమాల కోసం నయనతారను సంప్రదిస్తున్నా ఆమె నుంచి తెలుగు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ లభించడం లేదని తెలుస్తోంది.సాధారణంగా హీరోయిన్లు షూటింగ్ పూర్తైన తరువాత ఆ సినిమాకు సంబంధించిన ప్రమోషన్లలో పాల్గొంటూ సినిమాపై అంచనాలను పెంచడానికి ట్రై చేస్తారు.
అయితే నయనతార మాత్రం దర్శకనిర్మాతలకు ప్రమోషన్లకు హాజరు కానని చెబుతుంది.అయితే తెలుగులో స్టార్ హీరోల సినిమాల్లో నటిస్తే ప్రమోషన్లు చేయాల్సి వస్తూ ఉండటంతో నయనతార తెలుగు సినిమాలకే గుడ్ బై చెప్పే దిశగా అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది.
తమిళంలో నయనతార నాలుగు సినిమాల్లో నటిస్తుండగా అందులో రజనీకాంత్ సినిమా కూడా ఉంది.గడిచిన ఆరేళ్లలో నయనతార 22 సినిమాల్లో అందులో మూడు మాత్రమే తెలుగు సినిమాలు కావడం గమనార్హం.
ఇతర హీరోయిన్లతో పోలిస్తే రెట్టింపు రెమ్యునరేషన్ డిమాండ్ చేసే నయనతార సినిమా ప్రమోషన్లకు హాజరు కాకపోవడంపై కోలీవుడ్ దర్శక నిర్మాతల్లో కూడా అసంతృప్తి ఉంది.అయితే నయనతార వల్ల సినిమాకు బిజినెస్ భారీగా జరుగుతుండటంతో అక్కడి దర్శకనిర్మాతలు ఆమెనే హీరోయిన్ గా ఎంపిక చేసుకుంటున్నారు.
మరోవైపు విఘ్నేష్ శివన్ తో ప్రేమాయణం వల్ల నయనతార వార్తల్లో నిలుస్తోంది.వీళ్లిద్దరూ ఇప్పటికే పెళ్లి చేసుకున్నారంటూ సోషల్ మీడియాలో గాసిప్స్ వైరల్ అవుతూ ఉండటం గమనార్హం.