టాలీవుడ్ ఇండస్ట్రీలో అప్పట్లో జెమిని సినిమా తో వెంకటేష్ సరసన హీరోయిన్ గా నటించి ఇండస్ట్రీలో అడుగు పెట్టిన నమిత ఆ తర్వాత తెలుగులో పలు సినిమాలు చేయడం జరిగింది.పెద్దగా హిట్లు రాకపోవటంతో తర్వాత తమిళంలో మరియు కన్నడ హిందీ భాషలలో నటించి అక్కడ బీభత్సమైన క్రేజ్ సంపాదించడం జరిగింది.
తమిళంలో నమితా కి ఎవరు ఊహించనంత ఫాలోయింగ్ క్రియేట్ చేసుకోవడం జరిగింది.ఇటీవల తమిళ్ అసెంబ్లీ ఎన్నికల టైంలో కూడా ప్రముఖ రాజకీయ పార్టీకి ప్రచారం కూడా చేయడం జరిగింది.
అటువంటి నమిత తాజాగా తిరుమల తిరుపతి శ్రీవారిని దర్శించుకోవడం జరిగింది.అనంతరం మీడియాతో మాట్లాడుతూ పలు విషయాలను తెలియజేశారు.ప్రస్తుతం తాను భౌ భౌ అనే సినిమా చేస్తున్నట్లు.తెలియజేసింది.తన బ్యానర్ లో చేస్తున్న ఈ సినిమా థియేటర్లలో రిలీజ్ చేస్తా లేకపోతే ఓటీటీ ప్లాట్ ఫాం లో రిలీజ్ చేస్తారా అనేది ఇప్పుడు సస్పెన్స్ గా మారింది.2017 వ సంవత్సరం లో తిరుపతి లోనే తన బాయ్ ఫ్రెండ్ వీరేంద్రనాథ్ పెళ్లి చేసుకోవడం జరిగింది.ఆ తర్వాత సినిమాల్లో చేస్తూ రాణిస్తున్న నమిత తాజాగా తిరుపతిలో శ్రీవారిని దర్శించుకోవడం జరిగింది.