నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం మాస్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను డైరెక్షన్లో తన తాజా చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు.ఈ సినిమాలో బాలయ్య రెండు విభిన్న పాత్రల్లో నటిస్తున్నాడని, అవి ఆయన కెరీర్లోనే మైలురాయిగా మిగులుతాయని చిత్ర యూనిట్ అంటోంది.
కాగా ఈ సినిమాలో బాలయ్య సరసన హీరోయిన్లు ఎవరనే వార్తపై చిత్ర యూనిట్ ఇంకా క్లారిటీ ఇవ్వలేదు.
దీంతో ఈ సినిమాలో హీరోయిన్ల ఎవరనే విషయంపై ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లో కూడా పలు రకాల వార్తలు వినిపించాయి.
అయితే వాటిలో నిజం లేదని చిత్ర యూనిట్ చెబుతూ వచ్చింది.కాగా చిత్ర దర్శకుడు బోయపాటి ఈ సినిమాలో ఒక హీరోయిన్ను ఎట్టకేలకు ఓకే చేసినట్లు తెలుస్తోంది.
ముంబైకి చెందిన ఓ కొత్త అమ్మాయిని ఈ సినిమాలో హీరోయిన్గా ఓకే చేశారట.ఆమె ఎవరనే అంశాన్ని చిత్ర రెండో షెడ్యూల్ షూటింగ్ మొదలయ్యే ముందే ప్రకటిస్తారట చిత్ర యూనిట్.
ఇక ఈ సినిమాలో బాలయ్య అఘోరా పాత్రలో నటిస్తున్నాడనేది నిజం అని చిత్ర దర్శకుడు బోయపాటి క్లారిటీ ఇచ్చాడు.ఈ పాత్రతో బాలయ్య ప్రేక్షకులను మెస్మరైజ్ చేయడం ఖాయమని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది.