తెలుగులో నటించింది తక్కువ సినిమాలే అయినా స్టార్ హీరోయిన్ స్థాయిలో కృతిసనన్ గుర్తింపు తెచ్చుకున్నారు.సుకుమార్ డైరెక్షన్ లో తెరకెక్కిన 1 నేనొక్కడినే సినిమాతో కృతిసనన్ టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చారు.
ఆ సినిమాలో జర్నలిస్ట్ రోల్ లో నటించి మెప్పించారు.అయితే 1 నేనొక్కడినే సినిమాకు ప్రశంసలు వచ్చినా నిర్మాతలు ఆశించిన స్థాయిలో కలెక్షన్లు మాత్రం రాలేదు.
ఆ సినిమా బాక్సాఫీస్ దగ్గర హిట్ కాలేదు.
ఆ సినిమా తరువాత కృతిసనన్ దోచెయ్ అనే సినిమాలో నటించగా ఆ సినిమా కూడా బాక్సాఫీస్ దగ్గర హిట్ కాలేదు.
వరుసగా సినిమాలు ఫ్లాప్ కావడంతో టాలీవుడ్ కు దూరమైన కృతిసనన్ బాలీవుడ్ ఆఫర్లతో బిజీ అయ్యారు.ప్రస్తుతం ఈ హీరోయిన్ ప్రభాస్ రాముడి పాత్రలో నటిస్తున్న ఆదిపురుష్ సినిమాతో పాటు భేడియా అనే సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్నారు.
భేడియా మూవీలో వరుణ్ ధావన్ హీరో కాగా హర్రర్ కామెడీగా ఈ సినిమా తెరకెక్కుతోంది.
ఈ సినిమా గురించి కృతి మాట్లాడుతూ హర్రర్ సినిమాలు తనకు పెద్దగా నచ్చవని వెల్లడించారు.
అయితే భేడియా మూవీలో కామెడీ సీన్స్ కూడా ఎక్కువగా ఉండటంతో ఈ సినిమాలో నటించడానికి అంగీకరించానని కృతిసనన్ చెప్పుకొచ్చారు.హర్రర్, కామెడీని మిక్స్ చేసి డైరెక్టర్ అమర్ కౌశిక్ సినిమాను చూపించే విధానం తనకు ఎంతగానో నచ్చిందని కృతిసనన్ పేర్కొన్నారు.
దినేష్ విజ్జన్ ఈ మూవీకి ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తుండగా 2022 సంవత్సరంలో ఈ సినిమా రిలీజ్ కానుంది.ఈ సినిమాలతో పాటు కృతిసనన్ చేతిలో మరికొన్ని సినిమా ఆఫర్లు ఉన్నాయి.తెలుగులో సక్సెస్ కాలేకపోయిన ఈ హీరోయిన్ ఆదిపురుష్ సినిమా తరువాత వరుస ఆఫర్లతో మళ్లీ బిజీ అవుతానని భావిస్తున్నారు. ఆదిపురుష్ మూవీ రిలీజైన తర్వాత కృతిసనన్ కు తెలుగులో నిజంగానే ఆఫర్లు వస్తాయో లేదో చూడాల్సి ఉంది.