బడా నిర్మాత బెల్లంకొండ సురేష్ తనయుడు బెల్లంకొండ శ్రీనివాస్ ఇప్పటికే హీరోగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకొని కమర్షియల్ హీరోగా తనని తాను ప్రాజెక్ట్ చేసుకుంటున్నారు.భారీ బడ్జెట్ తో యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో ఎక్కువగా సినిమాలు చేస్తూ స్టార్ హీరో అయిపోవాలని భావిస్తున్నాడు.
ఇక ఇప్పుడు హిందీ ఆడియన్స్ కి కూడా తన టాలెంట్ చూపించాలని ప్రభాస్ ఛత్రపతి మూవీ రీమేక్ తో బాలీవుడ్ లోకి అడుగుపెడుతున్నాడు.ఇక ఈ సినిమా కోసం బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్స్ ని రంగంలోకి దించడానికి ప్లాన్ చేస్తున్నారు.
వివి వినాయక్ ఈ సినిమాతో హిందీలోకి దర్శకుడుగా ఎంట్రీ ఇస్తున్నాడు.
ఈ సినిమా ప్రస్తుతం ప్రీప్రొడక్షన్ దశలో ఉంది.
ఇదిలా ఉంటే ఇప్పుడు బెల్లంకొండ శ్రీనివాస్ తమ్ముడు గణేష్ కూడా హీరోగా ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతున్నాడు.ఎప్పటి నుంచి బెల్లంకొండ గణేష్ హీరో అవ్వాలని ప్రయత్నాలు చేస్తున్న సరైన కథ సెట్ కావడం లేదు.
అయితే ఈ సారి దర్శకుల సొంత కథలపై ఆధారపడకుండా హిందీ హిట్ మూవీ వివాహ్ రీమేక్ పై మనసు పెట్టాడు.ఇప్పటికే ఈ మూవీ రీమేక్ రైట్స్ కోనేసి వర్క్ కూడా మొదలు పెట్టినట్లు తెలుస్తుంది.
ఇదిలా ఉంటే ఈ సినిమాలో బెల్లంకొండ గణేష్ కి జోడీగా ఉప్పెన బ్యూటీ కృతి శెట్టిని సంప్రదిస్తున్నారు.ఇక ఈ సినిమాలో నటించడం కోసం కృతి శెట్టికి రెమ్యునరేషన్ కూడా కోటి రూపాయిల వరకు ఆఫర్ చేస్తున్నట్లు టాక్ వినిపిస్తుంది.
ప్రస్తుతం బిజీ హీరోయిన్ గా ఉండటంతో పాటు మంచి బజింగ్ తో కృతి శెట్టి దూసుకుపోతుంది.ఈమె అయితే తనకి పెర్ఫెక్ట్ అని ఎంతైనా ఇవ్వడానికి రెడీ అవుతున్నట్లు తెలుస్తుంది.