ఉప్పెన సినిమా తో హీరోయిన్ గా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన ముద్దుగుమ్మ కృతి శెట్టి మొదటి సినిమా విడుదల కాకుండానే రెండు మూడు ఆఫర్స్ దక్కించుకుంది.ఈ ముద్దుగుమ్మ ఎంట్రీ ఇచ్చి రెండేళ్లు కాకుండానే దాదాపు పది సినిమాలకు సైన్ చేసింది.
అందులో సగానికి పైగా ప్రేక్షకుల ముందుకు వచ్చేసాయి.వరుసగా ఉప్పెన నుండి మొదలుకుని శ్యామ్ సింగరాయ్, బంగారు రాజు సినిమా లు ఈమె కు సక్సెస్ లను తెచ్చిపెట్టాయి.
కానీ దివారియర్ నుండి ఈమె బ్యాడ్ టైం స్టార్ట్ అయినట్లుగా అనిపిస్తోంది.వరుసగా సక్సెస్ దక్కించుకొని టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా ఒక్క సారిగా వెలుగు వెలిగిన ముద్దుగుమ్మ కృతి శెట్టి ఇప్పుడు వరుసగా ఫ్లాప్స్ పడడం తో డీలా పడి పోయినట్లుగా అనిపిస్తుంది.
ఈ అమ్మడు చేస్తున్న సినిమా లు అతి త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి.ఆ సినిమా లపై కూడా పెద్దగా హోప్స్ ఉన్నట్లుగా అనిపించడం లేదు.
నాగ చైతన్య హీరో గా వెంకట్ ప్రభు దర్శకత్వం లో రూపొందుతున్న సినిమా పై మాత్రమే ఈమె కు ఆశలు అంచనాలు ఉన్నాయి అంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి.ఆ ఒక్క సినిమా కాకుండా మరో సినిమా తప్పితే ఈమెకి పెద్దగా సక్సెస్ తెచ్చి పెట్టే సినిమాలయితే ఏమీ లేవు అన్నట్లుగా ఇండస్ట్రీ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది.ఏడాది పాటు ఒక ఊపు ఊపిన కృతి శెట్టి అతి తక్కువ సమయం లోనే కనిపించకుండా పోతుంది అంటూ విశ్లేషకులు చర్చించుకుంటున్నారు.అతి తక్కువ సమయం లో కోటి అంతకు పైగా రెమ్యూనరేషన్ దక్కించుకున్న హీరోయిన్ గా కృతి శెట్టి నిలిచింది.
బ్యాక్ టు బ్యాక్ అలాగే మరిన్ని సక్సెస్ లు వచ్చి ఉంటే ఇప్పటికే రెండున్నర కోట్ల రూపాయల నుండి మూడు కోట్ల రూపాయల వరకు రెమ్యూనరేషన్ ఈ అమ్మడు పుచ్చుకునేది.కానీ బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్స్ కారణంగా ఇంకా కోటి రూపాయల పారితోషకం వద్దే ఈ అమ్మడు ఆగిపోయిందని కొందరు మాట్లాడుకుంటున్నారు.
పాపం ముందు ముందు అయినా మళ్ళీ ఈ అమడి జోరు కొనసాగుతుందా అనేది చూడాలి.