2016 సంవత్సరంలో విడుదలైన నేను శైలజ సినిమాతో ఇండస్ట్రీలోకి నటిగా ఎంట్రీ ఇచ్చారు కీర్తి సురేష్.ఆ సినిమా తరువాత నాని హీరోగా దిల్ రాజు నిర్మాతగా తెరకెక్కిన నేను లోకల్ సినిమాతో కీర్తి మరో సక్సెస్ ను తన ఖాతాలో వేసుకున్నారు.
తెలుగులో వరుస నటించిన సినిమాలు హిట్ కావడం కీర్తి గ్లామర్ రోల్స్ కు దూరంగా ఉండటంతో ఆమెకు నటిగా మంచి గుర్తింపు దక్కింది.నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో తెరకెక్కిన మహానటి సినిమా తో సౌత్ ఇండియా అంతటా కీర్తి సురేష్ పేరు మారుమ్రోగింది.
మహానటి సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో పాటు ఆ సినిమాలోని పాత్రకు కీర్తి సురేష్ తన నటనతో ప్రాణం పోశారు.అరుంధతి సినిమా తరువాత అనుష్కలా కీర్తి సురేష్ కూడా స్టార్ హీరోయిన్ గా ఊహించని స్థాయిలో సక్సెస్ సాధిస్తారని కీర్తి సురేష్ ఫ్యాన్స్ భావించారు.
అయితే ఆ సినిమా తరువాత కీర్తి సురేష్ నటించిన ఒక్క సినిమా కూడా బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ హిట్ కాకపోవడం గమనార్హం.
వరుస ఫ్లాపులు కీర్తి సురేష్ కెరీర్ పై ప్రభావం చూపడంతో పాటు ప్రేక్షకుల్లో ఆమెకు ఉన్న క్రేజ్ ను, మార్కెట్ ను తగ్గిస్తున్నాయి.
వరుస ఫ్లాపుల వల్ల కీర్తి సురేష్ ఒత్తిడికి లోనవుతున్నట్టు తెలుస్తోంది.మహానటి తరువాత తమిళంలో ఆమె నటించిన సర్కార్ మినహా మరే సినిమా హిట్ కాలేదు.
కీర్తి సురేష్ ఆశలన్నీ గుడ్ లక్ సఖి, సర్కారు వారి పాట సినిమాలపైనే ఉన్నాయి.ఈ రెండు సినిమాలు హిట్టైతే మాత్రమే కీర్తి సురేష్ కు కొత్త ఆఫర్లు వస్తాయి.
ఈ రెండు సినిమాలు ఫ్లాప్ అయితే మాత్రం కీర్తి కెరీర్ ప్రమాదంలో పడినట్లేనని చెప్పవచ్చు.ఈ సినిమాలతో కీర్తి సురేష్ సక్సెస్ ట్రాక్ లోకి వస్తారేమో చూడాల్సి ఉంది.