కరోనా ఎఫెక్ట్ తో ఆరు నెలల పాటు వాయిదా పడిన సినిమా షూటింగ్ లు మళ్ళీ మొదలయ్యాయి.కరోనా ప్రభావం ఎక్కువగానే ఉన్న, ఆరంభంలో ఉన్నంత భయం ఇప్పుడు ప్రజలలో కనిపించడం లేదు, అలాగే సెలబ్రిటీలలో కూడా కనిపించడం లేదు మన జాగ్రత్తలో మనం ఉంటే కరోనాతో ఎలాంటి ఇబ్బంది లేదని అర్ధం చేసుకున్న సెలబ్రిటీలు అందరూ కూడా ఒకరి తర్వాత ఒకరు షూటింగ్ లకి రెడీ అయిపోతున్నారు.50 ఏళ్ళు దాటిన హీరోలు కూడా భయం లేకుండా షూటింగ్ లలో పాల్గొంటున్నారు.కింగ్ నాగార్జున సౌత్ లో ఇప్ప్పటికే సినిమా షూటింగ్ స్టార్ట్ చేసి స్వీయ రక్షణ తీసుకుంటే భయపడాల్సిన అవసరం లేదని చూపించాడు.
ఇదిలా ఉంటే మొన్నటి వరకు కరోనా అంటే హడలిపోయిన హీరోయిన్స్ అందరూ భయాన్ని పక్కన పెట్టి షూటింగ్ కి రెడీ అయిపోయారు.
కీర్తి సురేష్ తో పాటు కొంత మంది అందాల భామలు కరోనా వాక్సిన్ వచ్చేంత వరకు షూటింగ్ లో పాల్గొనేది లేదని ముందు చెప్పారు.
అయితే ఇప్పుడు వారి నిర్ణయాన్ని మార్చేసుకున్నారు.షూటింగ్ లు స్టార్ట్ చేసేశారు.
ఆదా శర్మ అయితే అందరికంటే ముందుగా సినిమా షూటింగ్ స్టార్ట్ చేసి పూర్తి చేసేసింది కూడా.ఇక రకుల్ ప్రీత్ సింగ్ కూడా క్రిష్ సినిమా షూటింగ్ లో పాల్గొంటూ నాకెందుకు భయం అనేస్తుంది.
ఇక వాక్సిన్ వచ్చే వరకు షూటింగ్ లేదని చెప్పిన కీర్తి సురేష్ గుడ్ లక్ సఖి సినిమా షూటింగ్ లో పాల్గొని సినిమాకి పొడక్షన్ వర్క్ కి గుమ్మడికాయ కొట్టేసింది.మిగిలిన చిత్రాల షూటింగ్ లకి కూడా రెడీ అయిపోతుంది.
ఇక రష్మిక అయితే తనని షూటింగ్ కి ఎప్పుడు పిలుస్తారా అని ఆత్రుతగా ఎదురుచూస్తుంది.ఇక నభా నటేష్ ఇప్పటికే షూటింగ్ లో పాల్గొని తన షెడ్యూల్ పూర్తి చేసేసింది.
పాయల్ రాజ్ పుత్ కూడా హైదరాబాద్ లో షూటింగ్ కోసం అడుగుపెట్టింది.ఇలా హీరోల కంటే ముందుగానే హీరోయిన్స్ షూటింగ్ కోసం చాలా క్యూరియాసిటీతో కరోనాని లెక్క చేయకుండా రెడీ అయిపోయారు.
.