తెలుగులో ప్రస్తుతం మహానటి చిత్రం ఫేమ్ కీర్తి సురేష్ వరుస అవకాశాలతో దూసుకుపోతుంది.కాగా ప్రస్తుతం ఈ అమ్మడు తెలుగులో ప్రముఖ యంగ్ దర్శకుడు దర్శకత్వం వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్నటువంటి “రంగ్ దే” అనే చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది.
ఈ చిత్రంలో హీరోగా టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ నటిస్తున్నాడు.
అయితే తాజాగా కీర్తి సురేష్ షేర్ చేసినటువంటి ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
ఇంతకీ ఆ వీడియోని ఒకసారి పరిశీలించినట్లయితే కీర్తి సురేష్ చిత్ర దర్శకుడు వెంకీ అట్లూరి ని కొట్టడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. అంతేగాక వెంకీ అట్లూరి కూడా కీర్తి సురేష్ ని నువ్వు పెంగ్విన్ చిత్రంలో జోకర్ పాత్ర పోషించాల్సింది అంటూ సరదాగా ఆటపట్టిస్తున్నాడు.
కాగా ఈ వీడియో ని షేర్ చేసిన కొద్ది సమయంలోనే లక్షల సంఖ్యలో లైకులు, కామెంట్లు వచ్చాయి. అయితే ప్రస్తుతం ఈ చిత్ర యూనిట్ సభ్యులు దుబాయ్ లో షూటింగ్ జరుపుతున్నారు.
దీంతో తాజాగా కీర్తి సురేష్, డాన్స్ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్, వెంకీ అట్లూరి, నితిన్, తదితరులు బోటులో ప్రయాణిస్తున్న సమయంలో తీసినటువంటి వీడియోను కూడా షేర్ చేశారు.
అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం కీర్తి సురేష్ తెలుగులో రంగ్ దే చిత్రం తో పాటూ “గుడ్ లక్ సఖి” అనే చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది.
ఈ చిత్రం స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ తరహాలో ఉండబోతున్నట్లు సమాచారం. అయితే ఈ చిత్రంలో నిన్ను కోరి చిత్రం ఫేమ్ ఆది పినిశెట్టి హీరోగా నటిస్తుండగా ప్రముఖ సీనియర్ హీరో జగపతి బాబు కీలక పాత్రలో నటిస్తున్నాడు.
ఇటీవల ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ విడుదల కాగా మంచి రెస్పాన్స్ వచ్చింది.