స్టార్ హీరో ప్రభాస్ చాలా మంచి వ్యక్తి అని అతనితో కలిసి పని చేసిన వాళ్లు చెబుతుంటారు.ప్రభాస్ ఆతిథ్యం గురించి కూడా సులువుగా మరిచిపోలేమని అతనితో కలిసి పని చేసిన వాళ్లు చెబుతుంటారు.
అయితే ప్రభాస్ తో గొడవ పడ్డానని స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ ఆసక్తికర విషయాలను వెల్లడించారు.తలైవి ప్రమోషన్స్ లో భాగంగా కంగనా రనౌత్ ఈ విషయాలను ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.
జాతీయ స్థాయిలో గుర్తింపును తెచ్చుకుని అవార్డులను సైతం సొంతం చేసుకున్న కంగనా రనౌత్ తన పర్ఫామెన్స్ తో జాతీయ అవార్డులను సైతం అందుకున్న విషయం తెలిసిందే.దివంగత ముఖ్యమంత్రి జయలలిత జీవితచరిత్ర ఆధారంగా తెరకెక్కిన తలైవి సినిమాతో మరో బ్లాక్ బస్టర్ హిట్ ను ఖాతాలో వేసుకుంటానని కంగనా రనౌత్ భావిస్తున్నారు.
ఏక్ నిరంజన్ సినిమా సమయంలో తనకు, ప్రభాస్ కు మధ్య తరచుగా గొడవలు జరిగేవని ఆమె అన్నారు.
ఆ తర్వాత కొన్నిరోజులు ప్రభాస్ తో తనకు మాటలు లేవని కంగనా చెప్పుకొచ్చారు.
గత జ్ఞాపకాలను కంగనా రనౌత్ గుర్తు చేసుకుని ఆ అనుభవాలను పంచుకున్నారు.బాహుబలి సినిమా చూసిన తర్వాత తనకు గర్వంగా అనిపించిందని కంగనా చెప్పుకొచ్చారు.
తలైవి సినిమాకు విజయేంద్ర ప్రసాద్ కథ అందించగా ఏఎల్ విజయ్ దర్శకత్వం వహించారు.తలైవి సినిమాకు ప్రేక్షకుల నుంచి యావరేజ్ టాక్ వినిపిస్తోంది.
సినిమా అంతటా జయలలితను పాజిటివ్ గా చూపించే ప్రయత్నం చేశారనే కామెంట్లు వినిపించాయి.జయలలిత కెరీర్ లోని వివాదాలను టచ్ చేయకుండానే ఈ సినిమాను తెరకెక్కించినట్టు తెలుస్తోంది.తలైవి తర్వాత సౌత్ ఇండియాలో కంగనాకు సినిమా ఆఫర్లు పెరుగుతాయో లేదో చూడాల్సి ఉంది.భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమాలో అరవింద స్వామి కీలక పాత్రలో నటించారు.