తేజ డైరెక్షన్ లో కళ్యాణ్ రామ్ హీరోగా తెరకెక్కిన లక్ష్మీకళ్యాణం సినిమాతో హీరోయిన్ గా కెరీర్ ను మొదలుపెట్టిన కాజల్ అగర్వాల్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి చాలా సంవత్సరాలే అయినా అవకాశాలను అందిపుచ్చుకుంటుకున్నారు.ఒకప్పుడు యంగ్ హీరోల సినిమాల్లో మాత్రమే హీరోయిన్ రోల్స్ లో నటించిన కాజల్ అగర్వాల్ ఇప్పుడు సీనియర్ స్టార్ హీరోల సినిమాల్లో కూడా నటించడానికి అంగీకరించడంతో ఆమెకు ఆఫర్లు తగ్గడం లేదు.
కాజల్ కీలక పాత్రలో నటించిన మోసగాళ్లు సినిమా నేడు విడుదల కాబోతుంది.ఈ సినిమా కోసం కాజల్ పారితోషికం తీసుకోలేదని ఇండస్ట్రీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.15 సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో హీరోయిన్ గా కొనసాగుతున్న కాజల్ తనకు వేల కోట్ల రూపాయలు వస్తే ఏం చేస్తారనే ప్రశ్నకు భిన్నంగా సమాధానం ఇచ్చారు.గతేడాది కరోనా మహమ్మారి విజృంభణ వల్ల ఎన్నో రంగాలు తీవ్రంగా నష్టపోవడంతో పాటు ప్రజలు చాలా ఇబ్బందులు పడిన సంగతి తెలిసిందే.
దేశంలో కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తే పరిస్థితులు మారతాయని అందరూ భావించారు.అయితే కరోనా వ్యాక్సిన్ తీసుకోవడానికి అనేక నిబంధనలు ఉన్న సంగతి తెలిసిందే.తాజాగా ఒక నెటిజన్ నుంచి కాజల్ అగర్వాల్ కు వేల కోట్ల రూపాయలు వస్తే ఏం చేస్తారనే ప్రశ్న ఎదురు కాగా తనకు వేల కోట్ల రూపాయలు వస్తే అందరికీ కరోనా వ్యాక్సిన్ ఇప్పిస్తానంటూ కాజల్ కామెంట్ చేశారు.
తన మనస్సుకు ఈ విధంగా అనిపించిందని అందుకే ఇలా చేస్తున్నానని కాజల్ అగర్వాల్ చెప్పుకొచ్చారు.
ఎవరైనా వేల కోట్ల రూపాయల ఆదాయం వస్తే ఆ డబ్బును మరింత ఎక్కువ చేయాలని లేదా ఖరీదైన భవనాలు, నగలు కొనుగోలు చేయాలని భావిస్తారనే సంగతి తెలిసిందే.కాజల్ అగర్వాల్ మాత్రం ఆ విషయంలో భిన్నంగా ఆలోచించడం గమనార్హం.