టాలీవుడ్లో ప్రముఖ దర్శకుడు సుకుమార్ దర్శకత్వం వహించినటువంటి కుమారి 21ఎఫ్ చిత్రంలో హీరో రాజ్ తరుణ్ సరసన పరిణితి చెందిన ప్రియురాలిగా నటించిన హెబ్బా పటేల్ గురించి పెద్దగా తెలియని వారుండరు.అయితే వచ్చిన కొత్తలో వరుస సినిమాల అవకాశాలు దక్కించుకున్నప్పటికీ ఆ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద పెద్దగా ఆకట్టుకోలేకపోవడంతో ఈ అమ్మడికి ప్రస్తుతం అవకాశాలు కరువయ్యాయి.
అయితే ప్రస్తుతం హెబ్బా పటేల్ హీరో రామ్ పోతినేని హీరోగా నటిస్తున్న “రెడ్” అనే చిత్రంలో ఐటెం సాంగులో నటిస్తోంది.అయితే ఈ పాటకు సంబంధించి చిత్రీకరణని కూడా ఇటీవలే చిత్ర యూనిట్ సభ్యులు పూర్తి చేశారు.
ఇందులో భాగంగా ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నటువంటి ప్రముఖ దర్శకుడు కిషోర్ తిరుమల మాట్లాడుతూ ఈ చిత్రంలో హెబ్బా పటేల్ డ్యాన్స్ చేసినటువంటి పాట ఈ చిత్రానికె హైలైట్ గా నిలుస్తుందని చెప్పుకొచ్చాడు.అంతేగాక తొందర్లోనే ఈ పాటకు సంబంధించి ప్రోమో ని కూడా విడుదల చేస్తామని తెలిపాడు.
అయితే అవకాశాలు లేక గత కొద్దికాలంగా ఖాళీగా ఉన్నటువంటి ఈ అమ్మడు ఇప్పుడు ఐటెం సాంగ్స్ అయినా పర్లేదు చేస్తానంటూ ముందుకు వచ్చింది.అలాగే ఇటీవలే ప్రముఖ దర్శకుడు వెంకీ కుడుముల దర్శకత్వం వహించిన టువంటి భీష్మ చిత్రంలో కూడా ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలో నటించింది.ప్రస్తుతం రాజ్ తరుణ్ నటిస్తున్న “ఒరేయ్ బుజ్జిగా” అనే చిత్రంలో నటిస్తోంది.అయితే నటన పరంగా మంచి టాలెంట్ ఉన్నటువంటి హెబ్బా పటేల్ ఈ మధ్యకాలంలో ఎందుకో సినీ కెరీర్ పరంగా సరిగ్గా నిలదొక్కుకోలేక పోతుంది.
.