దేశముదురు సినిమాతో హన్సిక టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమయ్యారనే సంగతి తెలిసిందే. అల్లు అర్జున్ హీరోగా పూరీ జగన్నాథ్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా అప్పట్లో సంచలన విజయం సాధించింది.
అయితే హన్సిక ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను వెల్లడించారు.మెహర్ రమేష్ వల్లే దేశముదురు సినిమాలో నాకు ఛాన్స్ వచ్చిందని హన్సిక కామెంట్లు చేయడం గమనార్హం.
దేశముదురు మూవీ షూట్ సమయంలో నా పదహారో పుట్టినరోజు జరిగిందని ఆ పుట్టినరోజు వేడుకను నేను మరిచిపోలేనని ఆమె చెప్పుకొచ్చారు.బన్నీ, పూరీ జగన్నాథ్ నా పుట్టినరోజు వేడుకను పబ్ లో చేయించారని ఆమె తెలిపారు.
బన్నీ, పూరీ జగన్నాథ్ నాతో వేడిపాలు తాగించారని ఆమె కామెంట్లు చేయడం గమనార్హం.ఆ సమయంలో బన్నీ ఇచ్చిన గిఫ్ట్ ఎంతో ఫన్నీగా ఉందని హన్సిక వెల్లడించారు.
బన్నీ ఇచ్చిన గిఫ్ట్ ఇప్పటికీ నాతో ఉందని హన్సిక చెప్పుకొచ్చారు.ఆ పుట్టినరోజు వేడుక నాకు స్వీట్ మెమొరీ అని ఆమె తెలిపారు.
ఒక డైలాగ్ చెప్పలేక నేను టెన్షన్ పడుతుంటే బన్నీ పక్కనుండి తెగ నవ్వించేవారని ఆమె చెప్పుకొచ్చారు.హిమేష్ రేష్మియాతో హిందీలో నా తొలి సినిమా చేశానని హన్సిక కామెంట్లు చేశారు.
వరుసగా బెస్ట్ డ్యాన్సర్లు అయిన హీరోలతో కెరీర్ తొలినాళ్లలో నటించానని హన్సిక అన్నారు.
కంత్రి సినిమాలో తారక్ తో కలిసి నటించడం సంతోషాన్ని కలిగించిందని తారక్ మంచి మనిషి అని మంచి డ్యాన్సర్ అని హన్సిక తెలిపారు.నేను బేసికల్ గా హార్డ్ వర్క్ అంటే ఇష్టపడతానని హార్డ్ వర్క్ లో కొంచెం తేడా ఉండొచ్చు తప్ప బాలీవుడ్, టాలీవుడ్ ఈ విషయంలో సేమ్ అని హన్సిక కామెంట్లు చేశారు.హన్సిక వెల్లడించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.