దశాబ్దకాలం పాటు టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుని అగ్ర హీరోలందరి సరసన నటించిన హీరోయిన్లలో జెనీలియా ఒకరు.బొమ్మరిల్లు సినిమాలో జెనీలియా పోషించిన హాసిని పాత్రను ఇప్పటికీ మరిచిపోలేం.
సత్యం సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన జెనీలియా తెలుగు, తమిళం, హిందీ భాషల్లో నటిస్తూ గుర్తింపు తెచ్చుకుంది.అయితే కెరీర్ లో అవకాశాలు వస్తున్న సమయంలోనే జెనీలియా రితేష్ దేశ్ ముఖ్ ను పెళ్లి చేసుకోవడంతో హీరోయిన్ గా ఆమెకు అవకాశాలు తగ్గాయి.
పెళ్లి తర్వాత హిందీ, మరాఠీ సినిమాల్లో అడపాదడపా పాత్రల్లో నటించి మెప్పించింది జెనీలియా. అయితే సినిమాల్లోకి మళ్లీ పూర్తిస్థాయిలో రీఎంట్రీ ఇవ్వాలని జెనీలియా భావిస్తోంది.
జెనీలియా హీరోయిన్ గా నటించాలని ట్రై చేసినా అవకాశాలు రావడం కష్టం కాబట్టి అక్క, వదిన పాత్రల్లో నటించాలని జెనీలియా భావిస్తోందని తెలుస్తోంది.అవసరమైతే తల్లి పాత్రల్లో కూడా నటిస్తానని జెనీలియా చెబుతూ ఉండటం గమనార్హం.
అయితే జెనీలియా అభిమానులు మాత్రం అలాంటి పాత్రలు చేయవద్దని జెనీలియాను కోరుతున్నారు.వయస్సు 33 ఏళ్లే కావడంతో లేడీ ఓరియెంటడ్ పాత్రలను ఎంచుకోవాలని ఆమెకు సూచిస్తున్నారు.
మొదట బాలీవుడ్ సినిమాల ద్వారా పూర్తిస్థాయిలో రీఎంట్రీ ఇస్తానని చెబుతున్న జెనీలియా ఆ తర్వాత ఇతర ఇండస్ట్రీలలోకి కూడా ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది.అయితే అభిమానులు ఆమె తల్లి పాత్రల్లో నటించకూడదని సోషల్ మీడియా వేదికగా కోరుతున్నారు.
మరోవైపు కరోనా, లాక్ డౌన్ వల్ల షూటింగ్ లు సరిగ్గా జరగడం లేదు.ఇలాంటి సమయంలో జెనీలియా రీఎంట్రీ ఇచ్చినా పెద్దగా ఫలితం ఉండదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
కొన్నేళ్ల తరువాత జెనీలియా రీఎంట్రీ ఇస్తే బాగుండేదని ఆమె అభిమానులు చెబుతున్నారు.మరి జెనీలియా ఎలాంటి పాత్రల ద్వారా రీఎంట్రీ ఇస్తుందో చూడాల్సి ఉంది.