హీరోయిన్ ఛార్మి గురించి మనందరికీ తెలిసిందే.ఒకప్పుడు సినిమాలలో హీరోయిన్ గా నటించిన ఛార్మి ప్రస్తుతం నిర్మాతగా మారింది.
నీకేమైనా పూరి జగన్నాథ్ తో కలిసి పలు సినిమాలకు నిర్మాతగా కూడా వ్యవహరించింది.కాగా చార్మి ఇటీవలే పాన్ ఇండియా నిర్మాతగా ప్రమోట్ అవుతున్న విషయం తెలిసిందే.
డైరెక్టర్ పూరి జగన్నాథ్ తో కలసి మెహబూబా సినిమాను నిర్మించింది.ఆ తర్వాత మళ్లీ ఇస్మార్ట్ శంకర్ సినిమాతో కూడా సక్సెస్ ను అందుకుంది.
ఇక రామ్ పోతినేని హీరోగా నటించిన ఇస్మార్ట్ శంకర్ సినిమా తరువాత విజయ్ దేవరకొండ లైగర్ సినిమాని ప్రారంభించారు పూరి జగన్నాథ్,చార్మి.
పూరి జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్న లైగర్ సినిమాకు చార్మీ నిర్మాతగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే.
ఇందులో రౌడీ హీరో విజయ్ దేవరకొండ సరసన ముద్దుగుమ్మ అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తోంది.ఇకపోతే ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్ లో తెరకెక్కబోతున్న విషయం తెలిసిందే.
ఇక మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో బాక్సింగ్ దిగ్గజం అయిన మైకేల్ జాక్సన్ నటించిన విషయం తెలిసిందే.మైకేల్ జాక్సన్ పాత్ర ఇందులో అధ్యంతం ఆసక్తిని కలిగించినుందట.
అయితే ఈ సినిమాలో ఇప్పటికే విజయ్ దేవరకొండ మైఖేల్ జాక్సన్ మధ్య సన్నివేశాలను చిత్రీకరించిన విషయం తెలిసిందే.
అప్పటి ఆన్ లొకేషన్ ఫోటోలను తాజాగా చార్మి షేర్ చేసింది.లొకేషన్ లో లెజెండరీ బాక్సింగ్ దిగ్గజం అయిన మైకేల్ జాక్సన్ అలా కుర్చీలో కూర్చుని ఉండగా పక్కనే ఛార్మి కూర్చుని ఫోటోలకు నవ్వుతూ ఫోజులు ఇచ్చింది.ఇందుకు సంబంధించిన ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ మైక్ ఇది మీకు తెలియదు.
మా అత్యంత విలువైన సినిమా లెజెండ్ లో మిమ్మల్ని నటించడానికి ఒప్పించాలని కలగన్నాము.అంతిమంగా మీతో కలిసి పని చేసే అవకాశం కలిగింది.మీలాంటి లెజెండ్ తో కలిసి పని చేసే అదృష్టం మాకు కలిగినందుకు సంతోషంగా ఉంది అంటూ చార్మి తన ఇంస్టాగ్రామ్ లో రాసుకొచ్చింది.అంతేకాకుండా చివరగా లవ్ యు మైక్ టైసన్ అంటూ తన ప్రేమను కూడా కురిపించింది చార్మి.