చిన్న వయసులో ఇండస్ట్రీలో హీరోయిన్స్ గా ఆడుకు పెట్టి తరువాత చదువులు కొనసాగించిన హీరోయిన్స్ చాలా మంది ఉన్నారు.కెరియర్ సక్సెస్ అయిన తర్వాత చదుకునే అవకాశం లేకపోవడంతో ఎడ్యుకేషన్ కి దూరమైనా వారు కూడా ఉన్నారు.
ఇలా ఈ కోవలోనే ఇంటర్ మీడియట్ చదువుతున్న టైంలోనే ప్రేమమ్ సినిమాతో మలయాళీ ఇండస్ట్రీలో హీరోయిన్ గా అడుగు పెట్టి తరువాత తెలుగులో కూడా హీరోయిన్గా వరుస సినిమాలు చేసిన ముద్దుగుమ్మ అనుపమా పరామేశ్వరన్.టాలెంట్ ఉన్నా కూడా సరైన హిట్ లేకపోవడంతో దర్శకులు ఈ భామని ప్రస్తుతం పక్కన పెట్టారు.
దీంతో ఆగిపోయిన చదువుని అనుపమ కొనసాగిస్తుంది.
ఇదిలా ఉంటే తాజాగా బీహార్ లో టీచర్ ట్రైనింగ్ కి పరీక్షకి సంబందించిన హాల్ టికెట్ లో అనుపమా పరమేశ్వరన్ ఫోటో వచ్చింది.
దీంతో కేరళలో చదువుతున్న ఈ భామ బీహార్ లో పరీక్ష రాయడం ఏంటి అని కాస్తా షాక్ అయ్యారు.అయితే అసలు విషయం తెలిసిన తర్వాత బీహార్ ఎడ్యుకేషన్ బోర్డు ఉపశమన చర్యలు మొదలెట్టింది.
బీహార్ లో నిర్వహిస్తున్న టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ హాల్ టికెట్లో ఓ యువకుడి ఫోటోకు బదులు అనుపమ ఫోటో వచ్చింది.రిషికేశ్ కుమార్ టీచర్ పోస్ట్ కు అర్హత సాధించేందుకు ఎస్ టెట్ పరీక్షకు దరఖాస్తు చేసుకున్నాడు.
ఈ నెల 28న జరిగే పరోక్ష కోసం ఆన్ లైన్ లో హాల్ టికెట్లు బోర్డు విడుదల చేసింది.హాల్ టికెట్ లో రిషికేశ్ కి బదులు అనుపమ ఫోటో ఉంది.
దీనిపై అతను వెంటనే అధికారులను సంప్రదించాడు.అధికారులు తప్పుని గుర్తించి సరిచేశారు.
అయితే ఈ హాల్ టికెట్ సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అది కాస్తా వైరల్ అయ్యింది.