మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా సౌత్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం లో దిల్ రాజు నిర్మించబోతున్న సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ ప్రారంభం అయ్యింది.సినిమాకు సంబంధించిన చిత్రీకరణ అతి త్వరలోనే ప్రారంభం కాబోతుంది.
షూటింగ్ కు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి.రామ్ చరణ్ ప్రస్తుతం ఆర్ ఆర్ ఆర్ సినిమా చిత్రీకరణ లో పాల్గొంటున్నాడు.
ఉక్రెయిన్ లో ఉన్న రామ్ చరణ్ ఈ నెలాఖరు వరకు ఇండియా రాబోతున్నాడు.వారం నుండి రెండు వారాలు గ్యాప్ తీసుకున్న తర్వాత శంకర్ సినిమా షూటింగ్ లో జాయిన్ అవ్వబోతున్నట్లుగా తెలుస్తోంది.
ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా బాలీవుడ్ హాట్ బ్యూటీ కియారా అద్వానీని నటింపజేస్తున్నారు.ఇటీవల ఆమె పుట్టిన రోజు సందర్బంగా ఆ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు.
ప్రస్తుతం సినిమాకు సంబంధించిన కాస్టింగ్ ఎంపిక జరుగుతోంది.తాజాగా మరో స్టార్ హీరోయిన్ ను కూడా ఈ సినిమా కోసం ఎంపిక చేశారనే వార్తలు వస్తున్నాయి.
విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం రామ్ చరణ్ మరియు శంకర్ ల కాంబోలో రూపొందుతున్న సినిమాలో కీలక పాత్రలో అంజలిని నటింపజేయబోతున్నారు.తమిళంలో మంచి స్టార్ హీరోయిన్ గా అంజలికి గుర్తింపు ఉంది.తెలుగులో సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో నటించి స్టార్ గా పేరు దక్కించుకుంది.ప్రస్తుతం సినిమా ల్లో వరుసగా నటిస్తూ ఉన్న అంజలి హీరోయిన్ అని మాత్రమే కాకుండా అవకాశం వస్తే ఏ సినిమాలో అయినా నటించేందుకు సిద్దంగా ఉంటుంది.
శంకర్ వంటి స్టార్ డైరెక్టర్ తో వర్క్ చేయడం ప్రతి ఒక్కరి జీవిత ఆశం అన్నట్లుగా ఉంటుంది.కనుక ఈ సినిమా లో ఆమె నటించేందుకు వెంటనే ఓకే చెప్పిందని ఇండస్ట్రీ వర్గాల టాక్.
ఈ సినిమా ను సెప్టెంబర్ లో షూటింగ్ మొదలు పెట్టి వచ్చే ఏడాది చివరి వరకు లేదా 2023 లో విడుదల చేసే అవకాశాలు ఉన్నాయంటున్నారు.