తెలుగులో ప్రముఖ దర్శకుడు సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన “అతిథి” అనే చిత్రం తెలుగు సినీ ప్రేక్షకులకు ఇప్పటికీ బాగానే గుర్తుంటుంది.అయితే ఈ చిత్రంలో హీరోగా టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు నటించగా, హైదరాబాద్ బ్యూటీ అమృత రావు హీరోయిన్ గా నటించింది.
ఆశిష్ విద్యార్థి, నాజర్, బ్రహ్మానందం, మురళి శర్మ, తదితరులు ఈ చిత్రంలో ప్రధాన తారాగణంగా నటించారు.అలాగే ప్రముఖ టాలీవుడ్ సంగీత దర్శకుడు మణిశర్మ స్వరాలను సమకూర్చాడు.
అయితే ఈ చిత్రంలో హీరోయిన్ గా నటించిన హీరోయిన్ అమృత రావు ఆతరవాత ఏమైందో ఏమో గాని మళ్ళీ తెలుగులో నటించలేదు. దీంతో ఒక్క సినిమాతోనే తలుక్కున మెరిసి తెరమరుగైన హీరోయిన్ల జాబితాలో అమృత రావు కూడా చేరిపోయింది.
కానీ వచ్చీరావడంతోనే స్టార్ హీరో మహేష్ బాబు సరసన నటించే అవకాశం దక్కించుకున్నప్పటికీ అతిథి చిత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తా పడడంతో ఈ అమ్మడికి పెద్దగా గుర్తింపు రాలేదు. దాంతో ఎక్కువ కాలం సినీ పరిశ్రమలో హీరోయిన్ గా కొనసాగలేక పోయింది.
దీంతో ఇక చేసేదేమి లేక బాలీవుడ్ సినిమా పరిశ్రమకి మకాం మార్చింది. ఈ క్రమంలో తెలిసిన వారి ద్వారా బాలీవుడ్ లో నటించే అవకాశాలు వచ్చినప్పటికీ ఇప్పటికీ సరైన హిట్ లేక పోవడంతోసినిమా పరిశ్రమలో తన ఉనికిని చాటుకునేందుకు తీవ్రంగా శ్రమిస్తుంది.
కాగా ప్రస్తుతం “ద లెజెండ్ ఆఫ్ కునాల్” అనే ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది.అయితే ఈ చిత్రానికి సంబంధించిన చిత్రీకరణ పనులు ముంబై పరిసర ప్రాంతంలో జరుగుతున్నట్లు సమాచారం.