కోలీవుడ్ లో ప్రేమఖైదీ అనే సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన మల్లు బ్యూటీ అమలాపాల్.ఈ సినిమా మొదటి సినిమాతోనే నటిగా మంచి మార్కులు కొట్టేసి తరువాత కమర్షియల్ సినిమాల వైపు వచ్చింది.
ఇక హీరోయిన్ గా సౌత్ లో వరుస అవకాశాలు సొంతం చేసుకుంటూ బిజీ అవుతున్న సమయంలోనే దర్శకుడు ఏ.ఎల్.విజయ్ ని ప్రేమించి పెళ్లి చేసుకుంది.పెళ్లి తర్వాత ఏడాది పాటు సినిమాలకి దూరమైనా ఈ అమ్మడు అతనికి విడాకులు ఇచ్చేసి అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది.
పెళ్లి చేసుకొని కరెక్ట్ గా ఏడాది కూడా కాపురం చేయకుండా ఈ జంట విడిపోయారు.తరువాత అమలాపాల్ మళ్ళీ హీరోయిన్ గా సినిమాలు చేస్తూ బిజీ అయ్యింది.
తెలుగులో పెద్దగా అవకాశాలు రాకపోయినా కోలీవుడ్ లో మాత్రం భాగానే రాణిస్తుంది.ప్రస్తుతం ఓ వైపు సినిమాలు, మరో వైపు వెబ్ సిరీస్ లతో బిజీగా ఉన్న ఈ అమ్మడు తాజాగా మీడియాతో ముచ్చటించి విడాకుల తర్వాత తన జీవితం గురించి ఆసక్తికర విషయాలు పంచుకుంది.
పిట్టకథలు ప్రమోషన్ లో భాగంగా అమలాపాల్ మీడియా ఇంటర్వ్యూలో విడాకుల తరువాత జీవితంలో ఎదురైనా అనుభవాల గురించి చెప్పింది.విజయ్తో విడిపోవాలనుకున్న టైములో నన్ను అందరూ భయపెట్టారు.
చాలా మంది అర్ధం చేసుకోకుండా నువ్వొక అమ్మాయివి నీ కెరీర్ పాడైపోతుంది అంటూ కామెంట్లు చేశారు.ఏ ఒక్కరూ నన్ను సపోర్ట్ చెయ్యలేదు.
అయితే ఇప్పుడు నన్ను అర్ధం చేసుకునే వ్యక్తి నా జీవితంలోకి వచ్చాడు.ప్రస్తుతం నేను చాలా హ్యాపీగా ఉన్నాను అంటూఅమలా పాల్ చెప్పుకొచ్చింది.
ఇక ఈ మాటల బట్టి అమలాపాల్ ప్రస్తుతం ఎవరితోనో రిలేషన్ లో ఉందనే విషయం బయటపడింది.గతంలో ఓ బాలీవుడ్ పాప్ సింగర్ తో అమలాపాల్ పెళ్లి అయినట్లు ఫోటోలు బయటకి వచ్చాయి.
అయితే అవి వాస్తవం కాదని ఆమె క్లారిటీ ఇచ్చింది.మరి ఇప్పుడు ఎవరితో అమలాపాల్ రిలేషన్ లో ఉందనే విషయం తెలియాల్సి ఉంది.