తెలుగులో ప్రముఖ దర్శకుడు
వి.వి వినాయక్
దర్శకత్వం వహించిన నాయక్ చిత్రంలో మెగా పవర్ స్టార్
రామ్ చరణ్ తేజ్
సరసన చిందులేసినటువంటి ముద్దుగుమ్మ కొలీ వుడ్ హీరోయిన్
అమలాపాల్
అందరికీ బాగానే గుర్తు ఉంటుంది.
అయితే ఈ అమ్మడు తెలుగులో చేసింది కొద్ది సినిమాలే అయినా తెలుగు ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది.అయితే ఈమె నటించిన చిత్రాల్లో నాయక్, ఇద్దరమ్మాయిలతో, జెండాపై కపిరాజు, తదితర చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బాగానే ఆకట్టుకున్నాయి.
అయినప్పటికీ ఈ అమ్మడు ఎందుకో తెలుగులో అవకాశాలు దక్కించుకోలేకపోయింది.
అయితే ఈ అమ్మడు తన అభిమానులకు సోషల్ మీడియాలో తన ఫోటోలను షేర్ చేస్తూ నిత్యం అందుబాటులో ఉంటోంది.
అయితే ఇటీవలే
అమలా పాల్ బాత్ టబ్బు
లో దిగినటువంటి ఫోటోని
సోషల్ మీడియా
లో షేర్ చేసింది.అంతేగాక మేకప్ లేకుండా తీసుకున్నటువంటి మరో ఫోటోను కూడా షేర్ చేసింది.
దీంతో నెటిజన్లు ఈ ఫోటోలను తెగ వైరల్ చేస్తున్నారు.ఇందులో ముఖ్యంగా మేకప్ లేకుండా ఉన్నటువంటి అమలాపాల్ ఫోటోకి “మేకప్ లేకపోయినప్పటికీ నువ్వు చాలా అందంగా ఉన్నావ్” అంటూ కామెంట్లు చేస్తున్నారు.
అయితే బాత్ టబ్బులో దిగినటువంటి ఫోటో మాత్రం కొందరు నెగిటివ్ కామెంట్లు పెడుతున్నారు.ఇందులో ముఖ్యంగా సెలబ్రిటీలు ఇలాంటి ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తే పలురకాల ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందని కాబట్టి వెంటనే ఆ ఫోటోని తొలగించాలంటూ సూచిస్తున్నారు.
అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం అమలాపాల్ తెలుగులో
లస్ట్ స్టోరీస్
అనే చిత్రంలో నటిస్తోంది.ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటికే పలు ప్రొడక్షన్ పనులు కూడా పూర్తయ్యాయి.
అయితే ప్రస్తుతం కరోనా వైరస్ కారణంగా చిత్ర పరిశ్రమలోని షూటింగులు నిలిపివేయడంతో ఈ చిత్ర పనులు కూడా నిలిచిపోయాయి.
తాజా వార్తలు