తెలుగు, తమిళ భాషల్లో నటిగా ఐశ్వర్య రాజేష్ తనకంటూ మంచి గుర్తింపును సొంతం చేసుకున్నారు.ప్రస్తుతం ఐశ్వర్య రాజేష్ వరుస సినిమా ఆఫర్లతో బిజీ అవుతున్న సంగతి తెలిసిందే.
యాంకర్ గా కెరీర్ ను మొదలుపెట్టిన ఐశ్వర్య రాజేష్ తక్కువ సమయంలోనే నటిగా ఎదిగి పాపులారిటీని ఊహించని స్థాయిలో పెంచుకున్నారు.అయితే టీవీ, సినిమా ఇండస్ట్రీలలోకి ఎంట్రీ ఇవ్వడానికి ఐశ్వర్య రాజేష్ పడిన కష్టాలు అన్నీఇన్నీ కావు.
ఒక సందర్భంలో ఐశ్వర్య రాజేష్ మాట్లాడుతూ తాను సినీ కెరీర్ లో ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి చెప్పుకొచ్చారు.తనకు 8 సంవత్సరాల వయస్సు ఉన్న సమయంలోనే తండ్రి చనిపోయారని ఆమె అన్నారు.
ఆ తరువాత అమ్మ చిన్న బిజినెస్ చేయడంతో పాటు లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఏజెంట్ గా కూడా పని చేశారని ఐశ్వర్య అన్నారు.పెద్దన్న పది సంవత్సరాల వయస్సులో రోడ్ యాక్సిడెంట్ లో చనిపోయారని రెండో అన్న కూడా చనిపోయారని ఐశ్వర్య రాజేష్ చెప్పుకొచ్చారు.
ఊహించని కష్టాల వల్ల 15 సంవత్సరాల వయస్సులోనే కుటుంబ పోషణ భారం తనపై పడిందని ఆమె చెప్పుకొచ్చారు.
కుటుంబ పోషణ కొరకు 250 రూపాయల వేతనానికి సూపర్ మార్కెట్ లో పని చేశానని ఆ తర్వాత యాంకర్ గా ఈవెంట్లు చేస్తూ డబ్బులు సంపాదించనని ఆమె అన్నారు.ఆ తర్వాత సినిమాలు, సీరియళ్లలో చిన్నచిన్న పాత్రలు చేశానని ఐశ్వర్య రాజేష్ పేర్కొన్నారు.అవర్ గళ్ ఇవర్ గళ్ తను నటించిన తొలి సినిమా అని ఐశ్వర్య రాజేష్ అన్నారు.
నటిగా అట్టకత్తి మూవీ తనకు మంచి పేరు తెచ్చిపెట్టిందని ఐశ్వర్య రాజేష్ చెప్పుకొచ్చారు.కొంతమంది తాను హీరోయిన్ పాత్రకు అస్సలు సరిపోనని కామెంట్లు చేశారని అయితే స్టార్ హీరోయిన్ కావడమే లక్ష్యంగా పెట్టుకుని కెరీర్ ను కొనసాగిస్తున్నానని ఐశ్వర్య అన్నారు.