పూరీ జగన్నాథ్ టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం చేసిన హీరోయిన్లలో అదా శర్మ ఒకరు.చూడటానికి గ్లామరస్ గానే కనిపించే ఈ బ్యూటీకి సరైన సక్సెస్ లు దక్కకపోవడం, కొన్ని సినిమాలు హిట్టైనా అందులో అదా శర్మ చేసిన పాత్రలకు పెద్దగా ప్రాధాన్యత లేకపోవడం వల్ల ఆమె కెరీర్ ఊపందుకోలేదు.
అందం, అభినయం ఉన్న అదా శర్మకు సరైన విజయాలు దక్కి ఉంటే ఈపాటికి టాలీవుడ్ ఇండస్ట్రీలోని స్టార్ హీరోయిన్లలో ఒకరిగా నిలిచేది.
సైడ్ హీరోయిన్ పాత్రలను అదా ఎంపిక చేసుకోవడం కూడా ఆమె కెరీర్ కు మైనస్ గా మారింది.
అదా శర్మ 2008లో 1920 సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమైంది.తొలి సినిమాకు అదా బెస్ట్ డెబ్యూ యాక్టర్ గా ఫిల్మ్ ఫేర్ కు నామినేట్ అయింది.2008 నుంచి ఫిల్మ్ ఇండస్్ట్రీలో ఉన్నా ఇప్పటివరకు కెరీర్ లో చెప్పుకోదగ్గ ఒక హిట్ కూడా లేదంటే అదా సినిమా కెరీర్ ఏ విధంగా ఉందో సులభంగానే అర్థమవుతుంది.
అయితే అవకాశాలు తగ్గినా అడపాతడపా పాత్రలతో అదా ప్రేక్షకులను అలరిస్తూనే ఉంది.
అయితే కరోనా, లాక్ డౌన్ వల్ల అమ్మడికి ఖాళీ దొరికింది.గతంలో అదా శర్మ దోసెలు వేసిన వీడియో ఒకటి వైరల్ అయింది.
అయితే ఆ వీడియో వల్ల అదాకు ఎలాంటి ప్రయోజనం చేకూరలేదు.అయితే తాజాగా అదా పియానో వాయిస్తున్న వీడియోకు సంబంధించిన ఫోటోలు నెట్టింట హల్చల్ చేస్తున్నాయి.
అదా సినిమాలు లేకపోయినా మరో విషయంలో ప్రావీణ్యత సంపాదించుకుంటున్నంటూ పోస్ట్ చేసింది.అయితే అదా పోస్ట్ చేసిన వీడియోపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.సినిమా రంగంలో అవకాశాలు రాకపోయినా మరో ప్రొఫెషన్ గా పియానోను నేర్చుకుంటున్నానని… సినిమాల్లో నటిగా కొనసాగడానికే ప్రాధాన్యత ఇస్తానని… నటిగా కొనసాగడం కల అని ఆమె చెప్పుకొచ్చారు.