ప్రస్తుతం కరోనా వైరస్ ప్రపంచ దేశాలను వణికిస్తోంది.ఇప్పటికే దాదాపుగా ఆరు వేల మంది కరోనా వైరస్ బారినపడి చైనాలో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న సంగతి తెలిసిందే.
అయితే ఈ వైరస్ లక్షణాలు ప్రస్తుతం భారతదేశంలో కూడా అక్కడక్కడా కనిపిస్తున్నాయి.దీంతో ఇప్పటికే పలు రాష్ట్రాల ప్రభుత్వాలు ఈ వైరస్ గురించి అవగాహన కల్పిస్తూ పలు జాగ్రత్తలు తీసుకోమని సూచిస్తున్నారు.
అయితే తాజాగా భోజ్ పూరి హీరోయిన్ రాణి చటర్జీ తాను కరోనా వైరస్ లక్షణాలతో బాధపడుతున్నట్లు తన అధికారిక ఖాతా ద్వారా తెలిపారు.
గత పది రోజులుగా జ్వరం, చాతి నొప్పి, జలుబు, వంటి లక్షణాలతో బాధ పడుతున్నట్లు తెలిపింది.
అంతేగాక కర్నూల్ లో వైరస్ సోకినట్లు అనుమానంగా ఉందని భయబ్రాంతులకు గురి అవుతోంది.దీంతో నెటిజన్లు ఆమెకు తమ సానుభూతిని తెలియజేస్తున్నారు.అంతేగాక భయాందోళనకు గురి కావద్దని ఇటువంటి సమయంలోనే ధైర్యంగా ఉండాలని సూచిస్తున్నారు.మరికొందరైతే వెంటనే దగ్గరలో ఉన్నటువంటి వైద్యుల్ని సంప్రదించి ఆసుపత్రిలో చేరి తగు జాగ్రత్తలు తీసుకుంటే సమస్య ఉండదని అంటున్నారు.
కాగా నటి రాణి చటర్జీ భోజపురి లో పలు చిత్రాలతో పాటు సీరియల్ లో కూడా నటించి మెప్పించింది.దీంతో ఆమె తొందరగా కోలుకోవాలని పలువురు అభిమానులు దేవు డిని ప్రార్థిస్తున్నారు.