ఈ మధ్యకాలంలోసినిమా ఇండస్ట్రీలో డ్రగ్స్ భాగోతాలు ఎక్కువగా బయటకి వస్తున్నాయి.టాలీవుడ్ లో రెండేళ్ళ క్రితం డ్రగ్స్ రాకెట్ ఎంత సంచలనం అయ్యిందో అందరికి తెలిసిందే.
చాలా మంది ప్రముఖులకి ఆ సమయంలో నోటీసులు జారీ చేసి విచారించారు.ఆ తరువాత ఈ కేసులో సెలబ్రెటీలు అందరికి క్లిన్ చిట్ వచ్చింది.
ఇక సుశాంత్ సింగ్ మరణం తర్వాత బాలీవుడ్ లో డ్రగ్స్ మాఫియాకి సంబంధించి భాగోతాలు బయటకి రావడంతో కొంత మందిని అరెస్ట్ చేశారు.ఇప్పటికి ఈ కేసు విచారణ జరుగుతుంది.
శాండల్ వుడ్ లో కూడా డ్రగ్స్ స్కాండల్ లో హీరోయిన్లు సంజనా గల్రాని, రాగిణి ద్వివేదిలని అరెస్ట్ చేశారు.ఈ కేసు విచారణ సాగుతుంది.
రీసెంట్ గా ఈ కేసులో సంజనాకి బెయిల్ మంజూరు అయ్యింది.ఇక రాగిణికి ఆరోగ్యం క్షీణించడంతో హాస్పిటల్ కి తరలించారు.
ఇదిలా ఉంటే ఇప్పుడు మలయాళీ ఇండస్ట్రీలో ఓ హీరోయిన్ డ్రగ్స్ పార్టీలోకి పాల్గొని రెండ్ హ్యాండడ్ గా బుక్ అయ్యింది.దీంతో ఆమెని అరెస్ట్ చేసి స్టేషన్ కి తరలించారు.
కేరళలోని ఇడుక్కి జిల్లాలోని ఓ రిసార్ట్లో ఇటీవల డ్రగ్స్ పార్టీ చేసుకుంటుండగా సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు వెళ్లారు.ఈ క్రమంలో పార్టీలో డ్రగ్స్ తీసుకుంటున్న తొమ్మిది మందిని అరెస్ట్ చేశారు.
వారిలో నటి బ్రిస్టీ బిశ్వాస్ కూడా ఉన్నారు.మోడలింగ్లో మంచి గుర్తింపును పొందిన బ్రిస్టీ పలు చిత్రాల్లో కూడా నటించారు.
ఈ సందర్భంగా పలు రకాల డ్రగ్స్ని కూడా పోలీసులు సీజ్ చేసినట్లు తెలుస్తోంది.అయితే ఈ పార్టీకి చాలా మంది సెలబ్రిటీలు రావాల్సి ఉండేదని, రైడింగ్ జరుగుతున్నట్లు సమాచారం ముందే వారికి అందడంతో జాగ్రత్తపడినట్లు తెలుస్తుంది.
అయితే ఈ డ్రగ్స్ పార్టీకి ఎంత మందికి ఇన్విటేషన్ వెళ్లాయి అనే కోణంలో కూడా పోలీసులు ఇప్పుడు విచారణ చేస్తున్నారు.