ఫలక్ నుమా దాస్ హీరో విశ్వక్ సేన్ వరుసగా సినిమాలు చేస్తున్నాడు.ఇటీవల ఆయన చేసిన సినిమా పాగల్.
ఈ సినిమాను వేణు బెక్కం నిర్మించగా దిల్ రాజు మరో నిర్మాతగా వ్యవహరించాడు.ఈ సినిమా చిత్రీకరణ సమయంలోనే దిల్ రాజు దృష్టిని ఆకర్షించిందట.
దాంతో ఈ సినిమా నిర్మాణం లో భాగస్వామ్యం అయ్యేందుకు ముందుకు వచ్చాడు అంటూ ఇండస్ట్రీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.ఇక ఈ సినిమా ను విడుదల చేయాలనుకున్న సమయంలో కరోనా సెకండ్ వేవ్ మొదలు అయ్యింది.
కరోనా వచ్చి ఉండకుంటే ఇప్పటి వరకు పాగల్ ప్రేక్షకుల ముందుకు వచ్చేసి ఉండేది.కాని ఇప్పుడు పాగల్ సినిమా విడుదల విషయంలో సందిగ్దం నెలకొంది.
పెద్ద ఎత్తున సినిమా లు వాయిదాలు పడ్డాయి.పరిస్థితులు చక్కబడ్డా కూడా రాధే శ్యామ్ కేజీఎఫ్ మొదలుకుని ఎన్నో పెద్ద సినిమా లు చిన్న సినిమా లు విడుదలకు సిద్దం అవుతున్నాయి.
దాంతో పాగల్ ను ఓటీటీ రిలీజ్ చేస్తారట అంటూ వార్తలు వచ్చాయి.ఆ విషయమై మేకర్స్ క్లారిటీ ఇచ్చారు.
పాగల్ సినిమా ఓటీటీ విడుదల విషయమై చిత్ర యూనిట్ సభ్యులతో చర్చలు జరుగుతున్నాయనే వార్తలు నిజమే.కాని ఇప్పటి వరకు పాగల్ ఓటీటీ రిలీజ్ విషయమై తుది నిర్ణయాన్ని తీసుకోలేదు అంటూ ఇండస్ట్రీ వర్గాల ద్వారా యూనిట్ సభ్యులు తెలియజేస్తున్నారు.
పాగల్ సినిమా ఒక మంచి కమర్షియల్ ఎంటర్ టైనర్ గా రూపొందిన విషయం ను చిత్ర యూనిట్ సభ్యులు పదే పదే చెబుతున్నారు.దాంతో ప్రముఖ ఓటీటీ లు ఈ సినిమా ను విడుదల చేసేందుకు ఆసక్తిగా ఉన్నాయి.కాని ఈ సినిమాను నిర్మాతలు అమ్మేందుకు మాత్రం ఆసక్తిగా ఉన్నట్లుగా లేరు.మంచి రేటు వస్తున్నా కూడా ఒక నిర్ణయానికి రాలేక పోతున్నట్లుగా టాక్ వినిపిస్తుంది.ఒకటి రెండు వారాల్లో పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకునే అవకాశం ఉందంటున్నారు.