తెలుగులో వెళ్ళిపోమాకే అనే చిత్రం ద్వారా టాలీవుడ్ సినిమా పరిశ్రమకు హీరోగా పరిచయం అయిన యంగ్ హీరో విశ్వక్ సేన్ గురించి సినిమా ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.అయితే విశ్వక్ సేన్ తన మాస్ ఓరియెంటెడ్ నటనతో అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు.
కాగా ఇప్పటికే ఫలక్నామా దాస్, ఈ నగరానికి ఏమైంది, హిట్ ది ఫస్ట్ కేస్, తదితర చిత్రాల ద్వారా మంచి సక్సెస్ అందుకుకోవడంతో ప్రస్తుతం వరుస సినిమాల్లో హీరోగా నటించే అవకాశాలు దక్కించుకుని దూసుకుపోతున్నాడు.అయితే ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ కేసులు పెరిగిపోతుండడంతో ఈ విషయంపై విశ్వక్ సేన్ తన అధికారిక ఇంస్టాగ్రామ్ ద్వారా స్పందించాడు.
ఇందులో భాగంగా ఈ కరోనా వైరస్ విజృంభిస్తున్న సమయంలో ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించాలని కోరాడు.అంతేకాకుండా మన జీవితాలతో పాటు ఇతరుల జీవితాల గురించి ఆలోచిస్తూ మాస్కులు ధరించి బాధ్యతాయుతంగా ఉండాలంటూ పేర్కొన్నాడు.
అంతేకాకుండా తాను మాస్కు ధరించి ఉన్న సమయంలో తీసిన ఫోటో ని కూడా షేర్ చేశాడు.దీంతో కొందరు విశ్వక్ సేన్ అభిమానులు తమ అభిమాన హీరో చేసిన ఈ వ్యాఖ్యలను సోషల్ మీడియా మాధ్యమాలలో షేర్ చేస్తూ ప్రతి ఒక్కరూ మాస్కు ధరించాలని కోరుతున్నారు.
అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం విశ్వక్ సేన్ తెలుగులో “పాగల్” అనే చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు.ఈ చిత్రంలో విశ్వక్ సేన్ కి జంటగా మలయాళ బ్యూటీ “నివేదా పేతురాజ్” నటిస్తోంది.కాగా ఈ చిత్రానికి కి తెలుగు నూతన దర్శకుడు నరేష్ కుప్పిలి దర్శకత్వం వహిస్తుండగా టాలీవుడ్ ప్రముఖ సినీ నిర్మాత “దిల్ రాజు” నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు ఇటీవలే ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ విడుదల కాగా మంచి స్పందన లభించింది.కాగా ఈ చిత్రాన్ని ఈనెల 30వ తారీఖున విడుదల చేయాలని చిత్ర యూనిట్ సభ్యులు భావించినప్పటికీ ప్రస్తుతం ఉన్నటువంటి కరోనా వైరస్ పరిస్థితుల కారణంగా సినిమా షూటింగ్ నిలిచిపోవడంతో మరింత కాలం పాటు వాయిదా పడింది.