తమిళ స్టార్ హీరో విశాల్ చాలా కాలంగా వరలక్ష్మితో ప్రేమలో ఉన్నాడని, వారిద్దరు వివాహం చేసుకోబోతున్నట్లుగా వార్తలు వచ్చాయి.కాని వారిద్దరు మాత్రం ఎప్పటికప్పుడు తాము మంచి స్నేహితులం మాత్రమే అంటూ చెప్పుకొచ్చారు.
అయినా కూడా మీడియాలో వారి పెళ్లి వార్తలు మాత్రం ఆగలేదు.
ఎట్టకేలకు విశాల్కు అనీశా వివాహ నిశ్చితార్థం అవ్వడంతో అంతా కూడా అవాక్కయ్యారు.నిజంగానే విశాల్ మరియు వరలక్ష్మిల మద్య ఏం జరగలేదా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.ఇక అనీశాతో తనది ప్రేమ అని, దానికి పెద్దలు ఒప్పుకోవడంతో తాము పెళ్లికి సిద్దం అయినట్లుగా తాజాగా విశాల్ ఒక కార్యక్రమంలో చెప్పుకొచ్చాడు.
విశాల్ తన ప్రేమ గురించి మాట్లాడుతూ… అనీశాతో తనది చాలా కాలం నుండి ఉన్న ప్రేమ కాదని, కొన్ని నెలల క్రితమే ప్రారంభం అయ్యిందని చెప్పుకొచ్చాడు.ప్రేమ చిగురించడం, వెంటనే ఇద్దరి మనసులు కలవడం, ఆ తర్వాత పెద్దలకు ఒప్పించడం చక చక జరిగి పోయాయన్నాడు.అయోగ్య సినిమా కోసం నేను వైజాగ్లో షూటింగ్ చేసేందుకు వెళ్లాను.అక్కడ నన్ను కొంత మంది అమ్మాయిలతో కలిసి అనీశా కూడా కలిసింది.అప్పుడే ఆమె మైఖేల్ అనే చిత్రంలో తాను హీరోయిన్ గా నటిస్తున్నట్లుగా చెప్పుకొచ్చింది.వ్యవసాయం నేపథ్యంలో సాగే కథ అని, అందులో కనిపించే వారు మొత్తం కూడా వ్యవసాయం నేపథ్యం నుండి వచ్చిన వారే ఉంటారని చెప్పింది.
ఆ సినిమాపై ఆసక్తి ఏర్పడి, ఆ సినిమాకు తాను ఆర్థిక సాయం చేస్తానంటూ చెప్పాను.ఆ తర్వాత ఆ సినిమా గురించి కలవడం, అలా అలా ఇద్దరి మద్య పరిచయం స్నేహంగా, స్నేహం ప్రేమగా, ప్రేమ పెళ్లిగా మారిందని విశాల్ చెప్పుకొచ్చాడు.విశాల్ చేసుకోబోతున్న అమ్మాయి హీరోయిన్గా ప్రయత్నాలు చేస్తుందన్నమాట.త్వరలోనే మేఖేల్ అనే ప్రయోగాత్మక చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.తెలుగు మరియు తమిళంలో ఈమె హీరోయిన్ గా రాణించేందుకు కష్టపడుతుంది.మరి విశాల్ ను చేసుకున్న తర్వాత ఆమె హీరోయిన్గా కొనసాగుతుందేమో చూడాలి.